'ఆపరేషన్ సిందూర్' ఈ పేరు ఒక బ్రాండ్.. ట్రేడ్‌మార్క్‌ కోసం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ దరఖాస్తు!-reliance industries and 3 other apply for trademark of operation sindoor name know in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  'ఆపరేషన్ సిందూర్' ఈ పేరు ఒక బ్రాండ్.. ట్రేడ్‌మార్క్‌ కోసం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ దరఖాస్తు!

'ఆపరేషన్ సిందూర్' ఈ పేరు ఒక బ్రాండ్.. ట్రేడ్‌మార్క్‌ కోసం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ దరఖాస్తు!

Anand Sai HT Telugu

ఇప్పుడు దేశం మెుత్తం ఆపరేషన్ సిందూర్ గురించే మాట్లాడుకుంటుంది. ఆపరేషన్ సిందూర్ అనేది ఒక ఎమోషన్. అయితే ఈ పేరును ట్రేడ్‌మార్క్ కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు.

ముఖేష్ అంబానీ

ఆపరేషన్ సిందూర్' గురించి చాలా చర్చ జరుగుతోంది. భారతదేశం నిర్వహించిన ఒక పెద్ద సైనిక ఆపరేషన్ ఇది. దీనిలో భాగంగా ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగింది. ఇప్పుడు ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇతరులు ఈ పేరును ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైంది. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ఈ ప్రతీకార చర్య తీసుకుంది. కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.

ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, మరికొందరు తమ కోసం అంటే ట్రేడ్‌మార్క్‌గా ఆపరేషన్ సిందూర్ అనే పేరును నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును బుధవారం మే 7న ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీలో దాఖలు చేశారు. విద్య, వినోదానికి సంబంధించిన సేవల కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ సిందూర్ పేరును నమోదు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ సేవలు ట్రేడ్‌మార్క్‌ల క్లాస్ 41 కిందకు వస్తాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కాకుండా మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఈ పేరును నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యక్తులు ముఖేష్ చెత్రం అగర్వాల్, గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబెరాయ్ (రిటైర్డ్), అలోక్ కొఠారి. ఈ పేరుపై చట్టపరమైన హక్కులు ఎవరికి లభిస్తాయో చూడాలి.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ చేపట్టారు. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగింది. ఇందులో చాలా మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ప్రదేశాలపై దాడి జరిగిందని కేంద్రం తెలిపింది. ఈ చర్యలో పాకిస్థాన్ సైన్యానికి ఎటువంటి హాని జరగలేదు. ఈ ఆపరేషన్ కేవలం ఉగ్రవాదుల స్థావరాల లక్ష్యంగా జరిగింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.