ఈ రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై సూపర్ డీల్.. డిస్కౌంట్‌తో తక్కువకే మెుబైల్!-realme narzo n65 5g smart phone gets better discount know offer and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై సూపర్ డీల్.. డిస్కౌంట్‌తో తక్కువకే మెుబైల్!

ఈ రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై సూపర్ డీల్.. డిస్కౌంట్‌తో తక్కువకే మెుబైల్!

Anand Sai HT Telugu

రియల్‌మీ నార్జో ఎన్ 65 5జీ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో మంచి డీల్‌లో అందుబాటులో ఉంది. డిస్కౌంట్‌తో మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. క్యాష్ బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తున్నారు.

రియల్‌మీ నార్జో ఎన్65 5జీ స్మార్ట్‌ఫోన్

ీరు 12 వేల రూపాయల కంటే తక్కువకు మంచి ఫీచర్లతో 5జీ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకు గుడ్‌న్యూస్ ఉంది. రియల్‌మీ నార్జో ఎన్65 5జీ స్మార్ట్‌‌ఫోన్ అమెజాన్ బంపర్ ఆఫర్‌లో అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,498గా ఉంది. ఈ ఫోన్ మీద బ్యాంక్ డిస్కౌంట్ రూ.1,000 వరకు ఇస్తున్నారు. రూ.344 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఉంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్ ధరను రూ.11,700 వరకు తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

ఈ ఫోన్ ఫీచర్లు

ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను 1604×720 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందిస్తోంది. ఫోన్‌లో అందిస్తున్న ఈ డిస్ ప్లే 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని గరిష్ట బ్రైట్‌నెస్ 625 నిట్స్. 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ప్రాసెసర్‌గా కంపెనీ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను ఫోన్‌లో అందిస్తోంది.

కెమెరా, బ్యాటరీ

50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఈ బ్యాటరీ 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఓఎస్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.