Stock Market : ఆర్బీఐ ప్రకటన సమయంలో దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు.. పండగ చేసుకున్న ఇన్వెస్టర్లు-rbi mpc meet impact on stock market nifty sensex increase investors got profits in the morning ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : ఆర్బీఐ ప్రకటన సమయంలో దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు.. పండగ చేసుకున్న ఇన్వెస్టర్లు

Stock Market : ఆర్బీఐ ప్రకటన సమయంలో దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు.. పండగ చేసుకున్న ఇన్వెస్టర్లు

Anand Sai HT Telugu

RBI MPC Meeting and Stock Market : ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌ సమయంలో స్టాక్ మార్కెట్‌లలో జోరు కనిపించింది. సెన్సెక్స్, నిఫ్టీ గ్రీన్ లైన్‌లో ట్రేడవుతున్నాయి.

స్టాక్ మార్కెట్ (Unsplash)

భారత స్టాక్ మార్కెట్‌లు జోరు మీద కనిపిస్తున్నాయి. అక్టోబరు 9వ తేదీన కూడా అంటే వరుసగా రెండో రోజు కూడా ప్రధాన సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ తదితర అన్ని సూచీలు లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం మంచి జోష్ తర్వాత వేగం మరింత పెరిగింది.

రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ప్రకటనల తర్వాత మార్కెట్‌లో ఉత్సాహం నెలకొంది. ఇందులో వడ్డీ రేట్లు వరుసగా 10వ సారి స్థిరంగా ఉంచారు. అక్టోబర్ పాలసీ సమావేశం తర్వాత మార్కెట్‌లో అత్యధికంగా రియల్టీ, ప్రభుత్వ బ్యాంకింగ్ తదితర రంగాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. మార్కెట్ ర్యాలీలో ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆర్జించారు.

ప్రస్తుతానికి(11.42AM) దేశీయ మార్కెట్‌లో ఉత్సాహం కనిపిస్తోంది. సెన్సెక్స్ దాదాపు 420 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇండెక్స్ 85200 పైన ట్రేడవుతోంది. 25200 స్థాయి వద్ద ట్రేడవుతున్న నిఫ్టీలో కూడా దాదాపు 170 పాయింట్ల బలం ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఫార్మా, రియాల్టీ సహా అన్ని ఇతర రంగాల సూచీలు 1-2 శాతం జంప్ చేయగా ఎఫ్‌ఎంసిజి సెక్టార్‌లో కరెక్షన్ కనిపిస్తోంది.

దివీస్ లాబొరెటోరిస్ 5.92 శాతం లాభంతో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఏబీబీ ఇండియా లిమిటెడ్, సైమెన్స్ లిమిటెడ్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, మాక్రోటెక్ డెవలప్‌మెంట్ లిమిటెడ్, శ్రీరామ్ ఫైనాన్స్, షేర్లు కూడా పెరిగాయి. అదే సమయంలో నెస్లే ఇండియా షేర్ దాదాపు 3 శాతం పడిపోయింది. ఇది ఇండెక్స్‌లో టాప్ లూజర్‌గా నడుస్తోంది. ఐటీసీ, బ్రిటానియా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఓఎన్‌జీసీ షేర్లు కూడా కాస్త పడిపోయాయి.

స్టాక్ మార్కెట్ లో ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆర్జించారు. జోరుగా సాగిన కొనుగోళ్ల కారణంగా, ఉదయం 10.40 గంటలకు బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.464.54 లక్షల కోట్లకు పెరిగింది. ఇది అక్టోబర్ 8న మార్కెట్ ముగిసిన తర్వాత నిన్న రూ.459.50 లక్షల కోట్లు. పెట్టుబడిదారులు ప్రారంభ పెరుగుదలలోనే రూ. 5 లక్షల కోట్లకు పైగా లాభం పొందారు.

వడ్డీ రేట్లు యథాతథం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలని నిర్ణయించారు. అక్టోబర్ 7 నుంచి 9 వరకు జరిగిన ఈ సమావేశంలో 6 మంది సభ్యుల కమిటీ వరుసగా 10వ సారి వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. అక్టోబర్ పాలసీ సమావేశంలో వడ్డీరేట్లను స్థిరంగా ఉంచాలని గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. రెపో రేటు 6.50 శాతం వద్ద కొనసాగుతుంది.

గమనిక : ఈ కథనం పైన పేర్కొన్న సమయంలో మార్కెట్‌లు ఉన్న పరిస్థితి గురించి వివరించింది. తర్వాత మార్పులు జరగవచ్చు.