ఈ మూడు పెద్ద బ్యాంకులపై ఒకేసారి ఆర్బీఐ భారీగా జరిమానా.. కారణం ఏంటంటే-rbi imposes fine on kotak mahindra idfc first and pnb know heres why ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ మూడు పెద్ద బ్యాంకులపై ఒకేసారి ఆర్బీఐ భారీగా జరిమానా.. కారణం ఏంటంటే

ఈ మూడు పెద్ద బ్యాంకులపై ఒకేసారి ఆర్బీఐ భారీగా జరిమానా.. కారణం ఏంటంటే

Anand Sai HT Telugu

పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు మూడు ప్రధాన బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారీ జరిమానాలు విధించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లకు జరిమానా పడింది.

మూడు బ్యాంకులపై ఆర్బీఐ ఫైన్

కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లపై ఆర్‌బీఐ గురువారం జరిమానాలు ప్రకటించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ.61.4 లక్షలు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌పై రూ.38.6 లక్షలు, పీఎన్‌బీపై రూ.29.6 లక్షల జరిమానా విధించింది. వినియోగదారులకు అందించే సేవలలో లోపాలు, నిబంధనల ఉల్లంఘనకు ఈ జరిమానా పడింది.

కోటక్ మహీంద్రాపై

రుణ నిబంధనలను ఉల్లంఘించినందుకు కోటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్‌బీఐ రూ.61.4 లక్షల జరిమానా విధించింది. రుణ పంపిణీ వ్యవస్థ కోసం మార్గదర్శకాలు, రుణాలు, అడ్వాన్సులు చట్టబద్ధమైన, ఇతర పరిమితులు, ఆదేశాలను పాటించకపోవడం వల్ల ఈ చర్య తీసుకున్నారు. రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆర్‌బిఐ నిర్దేశించిన నియమాలను సరిగ్గా పాటించలేదు.

ఐడీఎఫ్‌సీ, పీఎన్‌బీపై

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కేవైసీ నియమాలను ఉల్లంఘించింది. కేవైసీ అంటే కస్టమర్ల గురించి సమాచారాన్ని పొందడం. ఈ నిబంధనలను సరిగ్గా పాటించనందుకు రూ.38.6 లక్షల జరిమానా విధించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా కస్టమర్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించింది. వినియోగదారులకు సరైన సేవ అందించనందుకు రూ.29.6 లక్షల జరిమానా విధించారు.

నిబంధనలు పాటించనందుకే

బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్‌పై ఆర్‌బీఐ ఆదేశాలను పాటించనందున ఈ చర్య తీసుకున్నారు. వినియోగదారులకు సౌకర్యాలను అందించడంలో విఫలమయ్యారు. ఈ నిబంధనలను పాటించనందుకు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

'ఈ జరిమానాలు నియంత్రణ నిబంధనలను పాటించడం లోపాలపై ఆధారపడి ఉంటాయి. బ్యాంకులు తమ కస్టమర్లతో జరిపిన ఏదైనా లావాదేవీ, ఒప్పందం చెల్లుబాటుతో దీనికి ఎటువంటి సంబంధం లేదు.'అని ఆర్బీఐ తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు మాత్రమే ఈ చర్య తీసుకున్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం