డీలర్‌షిప్‌లకు 500 కి.మీపైన రేంజ్ ఇచ్చే ఎంజీ సైబర్‌స్టర్.. లాంచ్ తర్వాత మార్కెట్ షేక్!-range of over 500 km mg cyberster electric car begins arriving at dealerships in india know more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  డీలర్‌షిప్‌లకు 500 కి.మీపైన రేంజ్ ఇచ్చే ఎంజీ సైబర్‌స్టర్.. లాంచ్ తర్వాత మార్కెట్ షేక్!

డీలర్‌షిప్‌లకు 500 కి.మీపైన రేంజ్ ఇచ్చే ఎంజీ సైబర్‌స్టర్.. లాంచ్ తర్వాత మార్కెట్ షేక్!

Anand Sai HT Telugu

భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కన్వర్టిబుల్ కారు.. ఎంజీ సైబర్‌స్టర్ డీలర్‌షిప్‌లకు రావడం ప్రారంభించింది. కంపెనీ దీన్ని త్వరలోనే లాంచ్ చేయబోతోంది. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.

ఎంజీ సైబర్‌స్టర్ (MG Cyberster)

ఎంజీ మోటార్ ఇండియా తన సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును భారతదేశంలోని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లకు పంపడం ప్రారంభించింది. ఈ కారు ఎంజీ ఈవి ఉత్పత్తి మాత్రమే కాదు.. ఇది భారతదేశంలో విక్రయించే మొదటి ఆల్-ఎలక్ట్రిక్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు.

ఎంజీ సైబర్‌స్టర్ మొదట 2023లో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఇప్పుడు సీబీయూ(కంప్లీట్లీ బిల్ట్ యూనిట్)గా భారతదేశానికి వస్తోంది. ఇది కంపెనీ ప్రీమియం ఎంపిక చేసిన డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తారు. ప్రారంభంలో పరిమిత యూనిట్లతో లభిస్తుంది.

డిజైన్

స్పోర్ట్స్ కారులా అద్భుతంగా కనిపించే ఎంజీ సైబర్ స్టర్ వైపు చూసి ఆకర్షితులవుతారు. ఇది తక్కువ స్లంగ్ డిజైన్ ను కలిగి ఉంది. దీనికి ఫ్యూచరిస్టిక్ స్కియర్ డోర్లు లభిస్తాయి. ఇది కాకుండా డ్యూయల్ డోర్లతో కూడిన ఓపెన్ రూఫ్ బాడీ ఉంటుంది. దీని లోపల మీకు 3 స్క్రీన్ల హైటెక్ డ్యాష్ బోర్డు లభిస్తుంది. ఇందులో ఎయిర్ క్రాఫ్ట్ తరహా స్టీరింగ్ వీల్‌ను అందించారు.

పవర్, రేంజ్

ఎంజీ సైబర్‌స్టర్ స్పోర్ట్స్ కారు రెండు పవర్ ట్రెయిన్ ఎంపికలలో వస్తుంది. ఇది సింగిల్ మోటార్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌ను పొందుతుంది. ఇది డ్యూయల్-మోటార్ ఏడబ్ల్యూడీ వేరియంట్లో లభిస్తుంది. ఈ కారు రేంజ్ 500 కిలోమీటర్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు.

ధర అంచనా

భారతదేశంలో లాంచ్ తేదీని, ధరను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇది త్వరలో ఎం9తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. దీని ధర రూ.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. ఇప్పటికే కొన్ని డీలర్ షిప్ ల వద్ద కస్టమర్ ప్రివ్యూ ప్రారంభమయ్యాయి.

ఎందుకు స్పెషల్

ఎంజీ సైబర్‌స్టర్ కేవలం ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు. భారతదేశంలో ఈవీ స్పోర్ట్స్ విభాగానికి కొత్త దిశను ఇచ్చే మోడల్. దీని రాకతో పనితీరు, స్టైల్ రెండింటినీ కోరుకునే యువ వినియోగదారులకు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆప్షన్ కూడా లభిస్తుంది. మీరు కూడా ఎలక్ట్రిక్ కార్లను ఇష్టపడితే, ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్పోర్టినెస్ కలయికను కోరుకుంటే ఎంజీ సైబర్‌స్టర్ వైపు చూడవచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.