RailTel share price : దూసుకెళుతున్న రైల్​టెల్​ స్టాక్​- ఇంట్రాడేలో 9శాతం జంప్​! కారణం ఇదే..-railtel share price jumps 9 percent on securing work order worth 25 crore from hpcl ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Railtel Share Price : దూసుకెళుతున్న రైల్​టెల్​ స్టాక్​- ఇంట్రాడేలో 9శాతం జంప్​! కారణం ఇదే..

RailTel share price : దూసుకెళుతున్న రైల్​టెల్​ స్టాక్​- ఇంట్రాడేలో 9శాతం జంప్​! కారణం ఇదే..

Sharath Chitturi HT Telugu

RailTel shares : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో రైల్​టెల్​ స్టాక్​ దూసుకెళుతోంది. 9శాతానికిపైగా లాభపడి రూ. 339.4 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఇందుకు ఒక కారణం ఉంది. అదేంటంటే..

దూసుకెళుతున్న రైల్​టెల్​ స్టాక్​ (Image: Unsplash)

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో దూసుకెళుతున్నాయి. అనేక రంగాల స్టాక్స్​ లాభాల్లో ఉన్నాయి. వాటిల్లో ఒకటి రైల్​టెల్​ స్టాక్​. నేటి ట్రేడింగ్​ సెషన్​లో ఈ రైల్​టెల్​ షేర్లు ఒకానొక దశలో 9శాతానికిపైగా లాభపడ్డాయి. సోమవారం మధ్యాహ్నం నాటికి దాదాపు 6శాతం జంప్​తో రూ. 328 వద్ద ట్రేడ్​ అవుతున్నాయి. ఈ స్టాక్​ లాభాలకు కారణం ఏంటంటే..

రైల్​టెల్​ స్టాక్​ ఎందుకు పెరుగుతోంది?

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.25 కోట్లకు పైగా విలువైన ఆర్డర్ వచ్చిందని కంపెనీ చెప్పడంతో రైల్​టెల్ షేరు ధర సోమవారం లాభాల్లో కొనసాగుతోంది.

"రైల్​టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ .25,15,24,500 /- (పన్ను మినహాయించి)కు వర్క్ ఆర్డర్ పొందింది," అని కంపెనీ మార్చ్​ 23న స్టాక్ ఎక్స్​ఛేంజ్​ ఫైలింగ్​లో సంస్థ తెలిపింది.

ఇది ఇప్పటికే ఉన్న ఎంపీఎల్ఎస్ / ఐఎల్ఎల్ లింక్​ల పునరుద్ధరణకు 5 సంవత్సరాల రేట్​ కాంట్రాక్ట్​, సాధ్యాసాధ్యాల నిర్ధారణకు లోబడి 5 సంవత్సరాల వ్యవధిలో వచ్చే ప్రతిపాదిత కొత్త కనెక్షన్లకు ఇది రేటు ఒప్పందం అని రైల్​టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఇప్పటికే ఎంపీఎల్​ఎస్/ఐఎల్​ఎల్​ లింక్​ల​ రెన్యువల్​తో పాటు రానున్న 5ఏళ్లల్లో అదనపు కనెక్షన్లు ప్రతిపాదిస్తే, వాటిని కూడా ఈ రేట్​ కాంట్రాక్ట్​ చేస్తుంది.

2025 ఏప్రిల్ 01 నుంచి 2030 మార్చి 31 వరకు ఆర్డర్ లేదా కాంట్రాక్ట్ అమలు చేయాల్సి ఉంటుంది.

రూ.16,89,38,002 (పన్నుతో సహా) విలువైన ఓఎఫ్​సీ లేయింగ్ పనులకు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి వర్క్ ఆర్డర్ అందుకున్నట్లు మార్చి 20న రైల్​టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

రైల్​టెల్ డివిడెండ్..

మరోవైపు రైల్​టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డు మార్చ్​ 12న పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్ లో 10% చొప్పున ఈక్విటీ షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండ్​ను ప్రకటించింది.

రైల్​టెల్ డివిడెండ్ రికార్డ్ తేదీ 2 ఏప్రిల్ 2025, బుధవారం. డివిడెండ్ చెల్లింపు తేదీ 9 ఏప్రిల్ 2025.

రైల్​టెల్ స్టాక్ ప్రైజ్​ ట్రెండ్..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో రైల్​టెల్​ స్టాక్​ 9శాతానికిపైగా లాభపడి 339.40 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అనంతరం రూ. 328 వద్దకు చేరింది. ఈ రైల్​టెల్ షేరు ధర ఒక వారంలో 22.5% పెరిగింది. ఒక నెలలో 10% వృద్ధిని సాధించింది. స్మాల్​క్యాప్ మల్టీబ్యాగర్ స్టాక్ ఏడాది (వైటీడీ) ప్రాతిపదికన 16.5 శాతం పడిపోగా.. ఆరు నెలల్లో 27 శాతం పతనమైంది. ఏడాది కాలంలో రైల్​టెల్ షేర్లు 6 శాతం నష్టపోయింది.

అయితే, రైల్​టెల్ షేర్లు దీర్ఘకాలంలో మల్టీబ్యాగర్ రాబడులను అందించాయి. ఈ పీఎస్​యూ స్టాక్ రెండేళ్లలో 240 శాతం, మూడేళ్లలో 278 శాతం వృద్ధిచెందింది.

(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం