రూ.20 ప్రీమియంతో రూ.2లక్షల బీమా.. మే 31తో ముగియనుంది, రెన్యువల్ చేసుకోండి!-pm suraksha bima yojana renewal date is 31st may 2 lakh insurance cover with 20 rupees premium ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ.20 ప్రీమియంతో రూ.2లక్షల బీమా.. మే 31తో ముగియనుంది, రెన్యువల్ చేసుకోండి!

రూ.20 ప్రీమియంతో రూ.2లక్షల బీమా.. మే 31తో ముగియనుంది, రెన్యువల్ చేసుకోండి!

Anand Sai HT Telugu

మీకు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం సురక్షా బీమా యోజన ఉందా? అయితే వెంటనే రెన్యువల్ చేసుకోండి. అలా కావాలి అంటే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉండాలి. అందుకోసం పెద్దగా ఖర్చు అవసరం లేదు.

పీఎం సురక్షా బీమా యోజన

ేంద్ర ప్రభుత్వం పేద వర్గాల ప్రయోజనాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అయితే ప్రజల్లో అవగాహన లేకపోవడంతో పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందడం లేదు. అతి తక్కువ ప్రీమియంతో రూ.2 లక్షల వరకు బీమా కవరేజీని అందించే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం గురించి చూద్దాం..

ఈ పథకం పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై). ఏడాదికి కేవలం రూ.20 ప్రీమియంతో నిరుపేదలను కవర్ చేయడమే ఈ పథకం లక్ష్యం. సొంత సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఏడాది కాలపరిమితితో ఈ స్కీమ్ ఉంటుంది. ఈ కాలం జూన్ 1 నుంచి మే 31 వరకు. మే 31లోగా ఈ ప్లాన్‌ను రెన్యువల్ చేసుకోవచ్చు.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కవరేజీ గురించి మాట్లాడితే.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ .2 లక్షల కవరేజీ ఉంది. ఇది కాకుండా రెండు కళ్ళు పూర్తిగా దెబ్బతినడం లేదా రెండు చేతులు లేదా కాళ్ళు ఉపయోగించడం కోల్పోవడం, ఒక కన్ను చూపు కోల్పోవడం, చేయి లేదా కాలు ఉపయోగించడం కోల్పోవడం వంటి వాటిపై బీమా కవరేజీ కూడా ఉంది.

ఒక కన్ను పూర్తిగా కోల్పోవడం లేదా చేయి లేదా కాలు ఉపయోగించడం పూర్తిగా, కోలుకోలేని విధంగా ఉంటే రూ .1 లక్ష బీమా కవరేజీ ఉంది. ఏప్రిల్ 23, 2025 నాటికి ఈ పథకం కింద మొత్తం 51.06 కోట్లకు పైగా నమోదు కాగా, 1,57,155 క్లెయిమ్‌లకు రూ.3,121.02 కోట్లు చెల్లించారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.