Vijay Shekhar Sharma : ‘నా బిడ్డకు యాక్సిడెంట్​ అయ్యింది- ఐసీయూలో ఉంది’.. పేటీఎంపై విజయ్​ శేఖర్​ భావోద్వేగం!-paytm was like a daughter to me who met with an accident says vijay shekhar sharma ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vijay Shekhar Sharma : ‘నా బిడ్డకు యాక్సిడెంట్​ అయ్యింది- ఐసీయూలో ఉంది’.. పేటీఎంపై విజయ్​ శేఖర్​ భావోద్వేగం!

Vijay Shekhar Sharma : ‘నా బిడ్డకు యాక్సిడెంట్​ అయ్యింది- ఐసీయూలో ఉంది’.. పేటీఎంపై విజయ్​ శేఖర్​ భావోద్వేగం!

Sharath Chitturi HT Telugu
Jul 07, 2024 10:14 AM IST

సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ సంస్థ ఫౌండర్​ విజయ్​ శేఖర్​ శర్మ. తన బిడ్డ ఐసీయూలో ఉందని భావోద్వగంగా మాట్లాడారు.

విజయ్​ శేఖర్​ శర్మ
విజయ్​ శేఖర్​ శర్మ (Bloomberg)

పేటీఎం సంక్షోభంపై భావోద్వగ ప్రసంగం చేశారు సంస్థ ఫౌండర్​, ఎండీ విజయ్​ శేకర్​ శర్మ. పేటీఎంని తన కూతురిగా భావించినట్టు చెప్పారు. తన బిడ్డకు యాక్సిడెంట్​ అయ్యి, ఇప్పుడు ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించారు.

yearly horoscope entry point

దిల్లీలో జరిగిన జేఐఐఎఫ్​ ఫౌండేషన్​ డే ఈవెంట్​లో పాల్గొన్నారు విజయ్​ శేఖర్​. ఈ నేపథ్యంలో పేటీఎం గురించి మాట్లాడారు.

"పేటీఎం కంపెనీ నా కూతురు లాంటింది. మేము కలిసి ఎదిగాము. లాభాల బాటలో పరిగెత్తాము. ఫ్రీ క్యాష్​ని జనరేట్​ చేశాము. జీవితంలో ముఖ్యమైన ఎంట్రెన్స్​ టెస్ట్​కి నా బిడ్డ సిద్ధమవుతున్నట్టు భావించాను. కానీ నా కూతురుకు యాక్సిడెంట్​ అయ్యింది. ఇప్పుడు ఐసీయూలో ఉంది," అని పేటీఎం సీఈఓ అన్నారు.

పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ కార్యకలాపాలను నియంత్రిస్తూ ఫిబ్రవరిలో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్​బీఐ. కేవైసీ నిబంధనలు పాటించడం లేదని, మనీ లాండరింగ్​ జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తూ, పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ సేవలను నిలిపివేసింది. ఇది పేటీఎం ఉన్న వన్​ 97 కమ్యూనికేషన్​ కంపెనీకి గట్టి షాక్​ ఇచ్చింది! కంపెనీ లాభాలు అమాంతం పడిపోయాయి. అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. అప్పటి నుంచి పేటీఎం సంస్థపై ఒత్తిడి మరింత పెరిగింది.

కంపెనీ ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని, గత కొంతకాలంలో పలు కీలక పాఠాలను నేర్చుకున్నానని విజయ్​ శేఖర్​ తెలిపారు.

"ప్రొఫెషనల్​ లెవల్స్​లో చూస్తే, మేము ఇంకా మెరుగైన ప్రదర్శన చేసి ఉండాల్సింది. ఇందులో సీక్రెట్​ ఏం లేదు. పరిస్థితులను మేము ముందే సరిగ్గా అర్థం చేసుకుని ఉండాల్సింది. మా మీద ఉంచిన బాధ్యతలను నెరవేర్చి ఉండాల్సింది. పాఠాలు నేర్చుకున్నాము," అని పేటీఎం ఫౌండర్​ చెప్పుకొచ్చారు.

పేటీఎం పేరెంట్​ కంపెనీ అయిన వన్​ 97 కమ్యూనికేషన్స్​, ఎఫ్​వై23 క్యూ4లో రూ. 23,99 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. దాని కన్నా ముందు త్రైమాసికంతో (రూ. 2,465 కోట్లు) పోల్చుకుంటే తక్కువ. ఇక సంస్థ నష్టాలు రూ. 168 కోట్ల నుంచి రూ. 551 కోట్లకు పెరిగింది. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​లో పెట్టుబడులను రైటాఫ్​ చేయడం ఇందుకు ప్రధాన కారణం.

ఈ పూర్తి వ్యవహారం పేటీఎం షేర్​హోల్డర్లకు నష్టాలనే మిగిల్చింది. వాస్తవానికి పేటీఎం స్టాక్​, ఇన్​వెస్టర్లను ఎప్పుడు బాధపెడుతూనే వచ్చింది. ఐపీఓలోనే ఈ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లో ఓపెన్​ అయ్యాయి. అక్కడి నుంచి పడుతూ, పడుతూ, పేటీఎం సంక్షోభం కారణంగా ఇప్పుడు రూ. 500 దిగువను ట్రేడ్​ అవుతున్నాయి.

పేటీఎం షేర్​ ప్రైజ్​ హిస్టరీ..

నవంబర్​ 2021లో ఐపీఓగా మార్కెట్​లోకి వచ్చిన పేటీఎం స్టాక్​ రూ. 1783 వద్ద గరిష్ఠాన్ని నమొదు చేసింది. వాస్తవానికి ఈ ఐపీ ప్రైజ్​ బ్యాండ్​ రూ. 2వేల కన్నా ఎక్కువే! ఇక ఏడాది కాలంలో పేటీఎం షేర్లు దాదాపు 49శాతం పతనమయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు 33శాతం నష్టాలను చూశాయి. నెల రోజుల్లో మాత్రం 15శాతం మేర పెరిగాయి. ఐదు రోజుల్లో దాదాపు 8శాతం వృద్ధి చెందాయి. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి పేటీఎం షేర్లు రూ. 438 వద్ద కొనసాగుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం