PAN - Aadhaar Link : పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN)కు ఆధార్ను అనుసంధానం చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు మార్చి 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఆలోగా ప్రజలందరూ తమ పాన్ కార్డుకు ఆధార్ను అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే పాన్ నిరర్థకమవుతుంది. అయితే ఇప్పటి వరకు పాన్-ఆధార్ లింక్ తుదిగడువును ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. చివరికి మార్చి 31గా నిర్ణయించింది. అయితే ఈసారి పొడిగిస్తుందో లేదో ఇంకా స్పష్టత లేదు. అందుకే ఇంకా పాన్-ఆధార్ లింక్ చేసుకోని వారు వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మంచిది. అలాగే ఇప్పటికే లింక్ చేసుకున్న వారు ఓ సారి స్టేటస్ చెక్ చేసుకొని నిర్ధారించుకోవచ్చు. మరి పాన్-ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
మీ దగ్గర్లోని పాన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి కూడా పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.