'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్; నిలిచిపోయిన ట్రేడింగ్-pakistan suspends stock trading after 7 percent drop amid operation sindoor ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్; నిలిచిపోయిన ట్రేడింగ్

'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్; నిలిచిపోయిన ట్రేడింగ్

Sudarshan V HT Telugu

పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ గురువారం కుప్పకూలింది. గురువారం పాక్ స్టాక్ మార్కెట్ 7 శాతం పైగా నష్టపోయింది. పాకిస్థాన్ లోని ప్రధాన నగరాల్లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయన్న వార్తలు రావడంతో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజీ ట్రేడింగ్ ను నిలిపివేసింది.

పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ (Bloomberg)

కరాచీ, లాహోర్ వంటి పాకిస్తాన్ ప్రధాన నగరాల్లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో పాకిస్తాన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ కెఎస్ఇ -30 గురువారం 7.2 శాతం వరకు పడిపోయింది. దాంతో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో గురువారం ఒక గంట పాటు ట్రేడింగ్ నిలిచిపోయింది.

పహల్గామ్ ఉగ్రదాడి నుంచి..

ఏప్రిల్ 22 న పహల్గామ్ దాడి జరిగిన నాటి నుంచి, పాకిస్తాన్ కెఎస్ఇ -30 ఇండెక్స్ దాని విలువలో 12.75 శాతం కోల్పోయింది. పాక్ స్టాక్ మార్కెట్ లో వరుసగా నాలుగో సెషన్లోనూ నష్టాలు చవిచూశాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ జరిపిన దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ బెంచ్ మార్క్ షేర్ ఇండెక్స్ బుధవారం దాదాపు 6 శాతం నష్టంతో ప్రారంభమై, చివరకు 3.1 శాతం నష్టంతో సెషన్ ను ముగించింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం