పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్థాన్ మధ్య నెలకొన్ని ఉద్రిక్తత బుధవారం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరి తాజా పరిస్థితులకు బుధవారం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్ ఎలా స్పందిస్తుంది? ఈరోజు స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది? నిపుణుల మాటలను ఇక్కడ తెలుసుకోండి..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 156 పాయింట్లు పెరిగి 80,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 82 పాయింట్లు కోల్పోయి 24,380 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 648 పాయింట్లు పడి 54,271 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3794.52 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,397.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
మే నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 7062.12 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,681.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఆపరేషన్ సిందూర్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు.. బుధవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
ఆపరేషన్ సిందూర్ వల్ల మార్కెట్లో సెంటిమెంట్ నెగిటివ్గా ఉండొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. కానీ దీని ప్రభావం ఎక్కువ రోజులు కనిపించే అవకాశం లేదని అంటున్నారు.
“నిఫ్టీ50లో వీక్నెస్ కొనసాగవచ్చు. 24,200 సపోర్ట్గా ఉంది. దీని కన్నా కింద పడితే షార్ట్ టర్మ్లో కరెక్షన్ కనిపించొచ్చు. 24,600 లెవల్స్ పైకి వెళితే ట్రెండ్ మారుతుంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపాుర.
ఆపరేషన్ సిందూర్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.95 శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.77శాతం నష్టపోయింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.87 శాతం పడింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఎలెకాన్ ఇంజినీరింగ్ కంపెనీ: రూ.593.6 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.636, స్టాప్ లాస్ రూ.572;
మహామాయ స్టీల్ ఇండస్ట్రీస్: రూ.276.05 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.296, స్టాప్ లాస్ రూ.266;
చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్: రూ.1886 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2018, స్టాప్ లాస్ రూ.1820;
ఆర్ఆర్ కబెల్: రూ.1213.5 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.1300, స్టాప్ లాస్ రూ.1171;
అలీవస్ లైఫ్ సైన్సెస్: రూ.1111 వద్ద కొనండి, టార్గెట్ రూ.1188, స్టాప్ లాస్ రూ.1072.
సంబంధిత కథనం