పాకిస్థాన్​పై భారత్​ ఆపరేషన్​ ‘సిందూర్​’- ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?-operation sindoor stock market updates gift nifty live and stocks to buy list 7 may 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  పాకిస్థాన్​పై భారత్​ ఆపరేషన్​ ‘సిందూర్​’- ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

పాకిస్థాన్​పై భారత్​ ఆపరేషన్​ ‘సిందూర్​’- ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

Sharath Chitturi HT Telugu

ఆపరేషన్​ సిందూర్​ నేపథ్యంలో భారత స్టాక్​ మార్కెట్​లు ఈరోజు ఎలా ఉండబోతున్నాయా? గిఫ్ట్​ నిఫ్టీ ఏం సూచిస్తోంది? నిపుణుల విశ్లేషణ ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

పహల్గామ్​ ఉగ్రదాడి అనంతరం భారత్​- పాకిస్థాన్​ మధ్య నెలకొన్ని ఉద్రిక్తత బుధవారం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆపరేషన్​ సిందూర్​ పేరుతో భారత్​ పాక్​తో పాటు పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరి తాజా పరిస్థితులకు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో స్టాక్​ మార్కెట్​ ఎలా స్పందిస్తుంది? ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఓపెనింగ్​ ఎలా ఉండబోతోంది? నిపుణుల మాటలను ఇక్కడ తెలుసుకోండి..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 156 పాయింట్లు పెరిగి 80,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 82 పాయింట్లు కోల్పోయి 24,380 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 648 పాయింట్లు పడి 54,271 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3794.52 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,397.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

మే​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 7062.12 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,681.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఆపరేషన్​ సిందూర్​ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

ఆపరేషన్​ సిందూర్​ వల్ల మార్కెట్​లో సెంటిమెంట్​ నెగిటివ్​గా ఉండొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. కానీ దీని ప్రభావం ఎక్కువ రోజులు కనిపించే అవకాశం లేదని అంటున్నారు.

“నిఫ్టీ50లో వీక్​నెస్​ కొనసాగవచ్చు. 24,200 సపోర్ట్​గా ఉంది. దీని కన్నా కింద పడితే షార్ట్​ టర్మ్​లో కరెక్షన్​ కనిపించొచ్చు. 24,600 లెవల్స్​ పైకి వెళితే ట్రెండ్​ మారుతుంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపాుర.

ఆపరేషన్​ సిందూర్​కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.95 శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.77శాతం నష్టపోయింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.87 శాతం పడింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఎలెకాన్ ఇంజినీరింగ్ కంపెనీ: రూ.593.6 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.636, స్టాప్ లాస్ రూ.572;

మహామాయ స్టీల్ ఇండస్ట్రీస్: రూ.276.05 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.296, స్టాప్ లాస్ రూ.266;

చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్: రూ.1886 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2018, స్టాప్ లాస్ రూ.1820;

ఆర్ఆర్ కబెల్: రూ.1213.5 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.1300, స్టాప్ లాస్ రూ.1171;

అలీవస్ లైఫ్ సైన్సెస్: రూ.1111 వద్ద కొనండి, టార్గెట్ రూ.1188, స్టాప్ లాస్ రూ.1072.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం