op jindal global university: ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, సియాటల్ యూనివర్సిటీల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా రెండు వర్సిటీల విద్యార్థులకు, ఫాకల్టీకి నూతన, సృజనాత్మక అవకాశాలు లభించనున్నాయి.
ఈ ఒప్పందం ద్వారా రెండు యూనివర్సిటీలు వివిధ విభాగాల పరిశోధనల్లో సంయుక్తంగా పాలు పంచుకుంటాయి. ఒక వర్సిటీ విద్యార్థి మరో యూనివర్సిటీలో కొంత కాలం పాటు చదువుకునే అవకాశం లభిస్తుంది. లైబ్రరీ ఎక్స్ చేంజ్ కు, ఫాకల్టీ ఎక్స్ చేంజ్ కు అవకాశం లభిస్తుంది. రెండు వర్సిటీల్లోని స్కాలర్స్ కు నాలెడ్జ్ షేరింగ్ కు, ఇరు వర్సిటీల్లో జరిగే సెమినార్లు, కాన్ఫెరెన్స్ లు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుంది.
ప్రస్తుతం సియాటల్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం ఆ వర్సిటీ ప్రెసిడెంట్ ఎడ్వర్డొ పీనల్వర్ నేతృత్వంలో భారత్ లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఓపీ జిందాల్ వర్సిటీ ప్రతినిధి బృందంతో వారు చర్చలు జరిపారు. సియాటల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో బిజినెస్, లా, డేటా సైన్సెస్, కంప్యూటర్ సైన్సెస్, నర్సింగ్ తదితర కళాశాలున్నాయని ప్రొఫెసర్ ఎడ్వర్డొ పీనల్వర్ తెలిపారు. తమ ఫాకల్టీ నైపుణ్యాలు, అనుభవాలను భాగస్వామ్య వర్సిటీలతో పంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నామన్నారు.
అనంతరం, ఓపీ జిందాల్ వర్సిటీ చాన్సెలర్ డాక్టర్ ప్రొఫెసర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో భారతదేశంలోనే తెలంగాణా నెంబర్ 1 గా ఉందని, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో ఎన్ రోల్ మెంట్ 25% నుంచి 27% మధ్య ఉంటే తెలంగాణలో అది 53%గా ఉందన్నారు. మెడికల్, ఇంజినీరింగ్, కంప్యూటర్, సోషల్ సైన్సెస్ సహా అన్ని కోర్సుల్లో తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ముందంజలో ఉందన్నారు. సియాటల్ వర్సిటీతో ఒప్పందం వల్ల ఓపీ జిందాల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతారన్నారు.
టాపిక్