ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్లపై బిగ్​ డిస్కౌంట్స్​! అక్షయ తృతీయ వేళ బంపర్​ ఆఫర్​- చెక్​ చేయండి..-ola electric announces benefits of up to 40 000 check details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్లపై బిగ్​ డిస్కౌంట్స్​! అక్షయ తృతీయ వేళ బంపర్​ ఆఫర్​- చెక్​ చేయండి..

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్లపై బిగ్​ డిస్కౌంట్స్​! అక్షయ తృతీయ వేళ బంపర్​ ఆఫర్​- చెక్​ చేయండి..

Sharath Chitturi HT Telugu

ఓలా ఎలక్ట్రిక్​ నుంచి కీలక అప్డేట్​. అక్షయ తృతీయ వేళ తమ పోర్ట్​ఫోలియోలోని ఎలక్ట్రిక్​ వాహనాలపై డిస్కౌంట్లను ప్రకటించింది ఈ సంస్థ. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఓలా ఎలక్ట్రిక్​

అక్షయ తృతీయ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్​ నుంచి బిగ్​ అప్డేట్​ వచ్చింది. తన పోర్ట్​ఫోలియోలోని ఎలక్ట్రిక్​ వాహనాలపై రూ. 40వేల వరకు డిస్కౌంట్​ని ఇస్తోంది ఈ ఈవీ తయారీ సంస్థ. ఫెస్టివల్ డిస్కౌంట్​తో పాటు ఎక్స్​టెండెడ్​ బ్యాటరీ వారంటీని కూడా ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ ప్రయోజనాలు ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.

డిస్కౌంట్స్​ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్​ జెన్​ 2 మోడల్స్​ రూ. 67,499 వద్ద, జెన్​ 3 మోడల్స్​ రూ. 73,999 వద్ద మొదలవుతాయి. అంతేకాదు, క్యాంపైన్​ సమయంలో కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో సేమ్​-డే డెలివరీకి కూడా ఓలా ఎలక్ట్రిక్​ హామీ ఇస్తోంది.

కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్​ ఆన్​లైన్​ లేదా ఆఫ్​లైన్​ స్టోర్స్​లో ఎలక్ట్రిక్​ స్కూటర్లను కొనుగోలు చేసుకోవచ్చు. గంటలోనే ఫుల్లీ రిజిస్టర్డ్​ వెహికిల్​ పొందొచ్చు.

సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ వాహనాలు..

ప్రస్తుతం వివిధ రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లను అందిస్తున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ దేశంలో కనీసం ఆరు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టనుంది. 2025 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ మోడళ్లను ఆవిష్కరించనుంది ఓలా ఎలక్ట్రిక్. ఈ కొత్త ఆఫర్లతో, ఓలా ఎలక్ట్రిక్ పట్టణ ప్రయాణికుల నుంచి అడ్వెంచర్​ టూరర్స్​ వరకు వైవిధ్యమైన వినియోగదారులకు సేవలు అందించాలని భావిస్తోంది.

కంపెనీ ఇప్పటికే స్పోర్ట్​స్టర్​, క్రూయిజర్, రోడ్​స్టర్ ప్రో, అడ్వెంచర్, డైమండ్​హెడ్​ సహా అనేక ఎలక్ట్రిక్ బైక్స్​ని ప్రదర్శించింది. ఇప్పుడు తన ఎలక్ట్రిక్ బైక్స్​ పోర్ట్​ఫోలియోను మరింత పెంచడానికి ప్రయత్నిస్తోంది. అదనంగా, ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

2026 ఆర్థిక సంవత్సరం రెండొవ త్రైమాసికం తరువాత ఆరు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. వీటిలో, ఎస్ 1 స్పోర్ట్స్ హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ప్రస్తుతం ఉన్న ఓలా ఎస్ 1 ప్లాట్​ఫామ్​పై రెడీ అయ్యింది. ఎస్ 1 లైనప్​లో అత్యంత శక్తివంతమైన మోడల్ అవుతుందని భావిస్తున్నారు.

అదనంగా, ఎస్ 2 అనే కొత్త ప్లాట్​ఫామ్​ నుంచి ఎస్ 2 సిటీ, ఎస్ 2 స్పోర్ట్స్, ఎస్ 2 టూరర్​ సహా వివిధ మోడళ్లను పరిచయం అవ్వొచ్చు. ఎస్ 1 సిటీ కమ్యూటర్ ఎంపికగా పనిచేస్తుంది. ఎస్ 2 స్పోర్ట్స్ అధిక-పనితీరు అవసరాలను తీరుస్తుంది. ఎస్ 2 టూరర్ సుదూర ప్రయాణాలపై దృష్టి పెడుతుంది. లాంగ్​ రేంజ్​ కూడా ఉండొచ్చు. అంతేకాకుండా మ్యాక్సీ స్కూటర్​తో పాటు ఎస్​3 గ్రాండ్​ అడ్వెంచర్​, ఎస్​3 గ్రాండ్​ టూరర్​ కోసం కొత్త ఎస్​3 ప్లాట్​ఫామ్​ని రూపొందిస్తోంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం