2025 లో అయితే, మీరు ఎలాంటి సంస్థను స్థాపించేవారు? అన్న ఒక యూజర్ ప్రశ్నకు ఆన్ లైన్ బ్రోకరేజీ ప్లాట్ ఫామ్ జెరోధా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితిన్ కామత్ బుధవారం ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 2025లో అయితే, జీరోధాను స్థాపించి ఉండేవాళ్లం కాదన్నారు. తన ట్రేడింగ్ ప్రశ్నోత్తరాల ప్లాట్ ఫామ్ లో ఒక పోస్ట్ కు సమాధానమిస్తూ ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం మార్కెట్లు బ్రోకరేజీ సంస్థలతో రద్దీగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో, అదే తరహా సేవలను అందించే మరో బ్రోకరేజ్ సంస్థను ప్రారంభించడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు.
గత 10 సంవత్సరాలలో తమ సంస్థ జీరోధా బాగా అభివృద్ధి చెందిందని కామత్ అన్నారు. వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజే.. అప్పటికే మార్కెట్లో ఉన్న "ఉత్తమమైన" ప్రత్యర్థిని ఓడించడానికి ప్రయత్నించడంలో అర్థం లేదని కామత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మార్కెట్లో జెరోధా, గ్రో, అప్ స్టాక్స్, ఏంజిల్ వన్ వంటి డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థలు ఉన్నాయి. 2025 మార్చి నాటికి భారతదేశంలో 3.94 కోట్లకు పైగా డీమ్యాట్ ఖాతాలు యాక్టివ్ గా ఉన్నాయి.
గతంలో కాకుండా, ఇప్పుడు ఏదైనా సంస్థను ప్రారంభించాలనుకుంటే, ఎలాంటి సంస్థను స్థాపిస్తారు? అన్న మానవ్ అగర్వాల్ అనే జెరోధా కమ్యూనిటీ యూజర్ ప్రశ్నకు నితిన్ కామత్ సమాధానమిచ్చారు. సాధారణ బ్రోకరేజ్ సంస్థను కాకుండా, యూజర్లు అత్యంత ఉత్తమమైన ప్రయోజనాలను అందించే బ్రోకరేజీ సంస్థను ప్రారంభించి ఉండే వాడినేమో అని అన్నారు. ఇతర పోటీ సంస్థల కన్నా యూజర్ కు మెరుగైన ప్రయోజనాలు అందించి, ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తానని చెప్పారు. అయితే, ఈ ప్రయత్నం తక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని, అయితే దీని నుండి ప్రజలు "గణనీయంగా" సంపాదించే అవకాశం ఉందని కామత్ అన్నారు.
సంబంధిత కథనం