స్కామర్లు మిమ్మల్ని మోసం చేయడానికి నిరంతరం కొత్త పద్ధతులను వెతుకుతున్నారు. ఇండియా పోస్ట్ పేరుతో వచ్చే ఇప్పుడు వస్తున్న ఎస్ఎంఎస్ల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయమని సందేశాలు వస్తాయి.
అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఫ్యాక్ట్ చెక్ ఈ ఎస్ఎంఎస్ మోసపూరితమైనదిగా గుర్తించింది. పాన్ కార్డు అప్డేట్లకు సంబంధించి ఇండియా పోస్ట్ పేరిట వచ్చే సందేశాలు నిజమైనవి కావని, ఫేక్ అని హెచ్చరించింది. 24 గంటల్లోగా వినియోగదారులు తమ పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయకపోతే, వారి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని ఆ సందేశం సారాంశం. ఇండియా పోస్ట్ ఎప్పుడూ అలాంటి నోటిఫికేషన్లను పంపదని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పిఐబి స్పష్టం చేసింది.
‘ప్రియమైన వినియోగదారు, మీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా ఈ రోజు బ్లాక్ చేయబడింది. దయచేసి వెంటనే మీ పాన్ కార్డును అప్డేట్ చేయండి ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..’ అంటూ ఒక లింక్ వస్తుంది. దాని పొరపాటున క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ అవుతుంది.