Vande Bharat trains : వందే భారత్​ ఎఫెక్ట్​.. భారీగా పడిపోతున్న విమాన టికెట్​ ధరలు!-nearly 30 percent fall in airfares after vande bharat trains launch ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vande Bharat Trains : వందే భారత్​ ఎఫెక్ట్​.. భారీగా పడిపోతున్న విమాన టికెట్​ ధరలు!

Vande Bharat trains : వందే భారత్​ ఎఫెక్ట్​.. భారీగా పడిపోతున్న విమాన టికెట్​ ధరలు!

Sharath Chitturi HT Telugu

Vande Bharat trains : వందే భారత్​ రైళ్ల డేటాను సేకరించడం మొదలుపెట్టింది భారతీయ రైల్వే. కాగా.. ఈ డేటాతో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

వందే భారత్​ ఎఫెక్ట్​.. భారీగా పడిపోతున్న విమాన టికెట్​ ధరలు!

Vande Bharat trains : భారత ప్రభుత్వం.. వందే భారత్​ రైళ్లను వరుసగా లాంచ్​ చేస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు తొలిసారిగా.. ఈ రైళ్లకు ఉన్న డిమాండ్​ను మానిటర్​ చేయడం మొదలుపెట్టింది భారతీయ రైల్వే. ప్రయాణికుల వయస్సు, లింగం వంటి డేటాను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ డేటా ద్వారా పలు ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి.

వందే భారత్​ రైళ్లకు క్రేజీ డిమాండ్​..!

తొలుత.. నాలుగు రూట్ల (ముంబై, గోవా, సోలాపూర్​, శిర్డి)కు సంబంధించిన వందే భారత్​ రైళ్ల డేటాను మానిటర్​ చేస్తోంది భారతీయ రైల్వే. ఇవన్నీ ముంబై నుంచే మొదలవుతున్నాయి. ఈ రూట్లల్లో ఈ తరహా రైళ్లను అధికంగా వినియోగిస్తున్న వారి వయస్సు 31-45 మధ్యలో ఉందని, ఆ తర్వాత 15-30ఏళ్ల వయస్సు వారు ఉన్నారని డేటా సూచిస్తోంది.

మొత్తం మీద.. ఈ రూట్లలో సెప్టెంబర్​ 15 నుంచి అక్టోబర్​ 13 వరకు 85,600 మంది పరుషులు, 57,838మంది మహిళలు, 26 ట్రాన్స్​జెండర్లు ప్రయాణించారు. ప్రయాణికుల్లో 1-14ఏళ్ల వయస్సు వారి వాటా 5శాతంగా ఉంది. అంతేకాకుండా.. సెప్టెంబర్​లో ఈ నాలుగు రూట్లల్లో వందే భారత్​ రైళ్ల ఆక్యుపెన్సీ 77శాతం- 101శాతం మధ్యలో ఉండటం విశేషం.

Vande Bharat trains in India : వందే భారత్​ రైళ్లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రయాణికుల నెంబర్లను పెంచుకునేందుకు ఈ డేటా ఉపయోగపడుతుందని భారతీయ రైల్వే భావిస్తోంది.

పరిశ్రమ అంచనాల ప్రకారం.. వందే భారత రైళ్ల ఎంట్రీతో.. ఎయిర్​ ట్రాఫిక్​ 10-20శాతం పడిపోయింది! అదే సమయంలో విమానాల టికెట్​ ధరలు 20-30శాతం దిగొచ్చాయి!

"ప్రయాణికుల ఇష్టాలను తెలుసుకునేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది. భవిష్యత్తు కార్యచరణ, సేవలు, ఫుడ్​ మెన్యూతో పాటు ఇతర అంశాలను పరిశీలించేందుకు భారతీయ రైల్వేకు ఈ డేటా చక్కగా యూజ్​ అవుతుంది," అని పబ్లిక్​ పాలిసీ ఎనలిస్ట్​ (మొబిలిటీ అండ్​ ట్రాన్స్​పోర్ట్​) పరేశ్​ రావల్​ తెలిపారు.

Vande Bharat trains Hyderabad : ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రూట్లలో వందే భారత్​ రైళ్లు దూసుకెళుతున్నాయి. త్వరలోనే మరిన్ని ప్రాంతాలకు కూడా ఈ సేవలు విస్తరించనున్నాయి. ముఖ్యంగా.. జమ్ము-శ్రీనగర్​ రూట్​లో ఓ వందే భారత్​ రైలును త్వరలోనే ప్రారంభించినునట్టు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​ ఇటీవలే వెల్లడించారు.

ఇతర ట్రైన్స్​తో పోల్చుకుంటే.. ఈ వందే భారత్​ రైళ్లతో ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతోంది. అందుకే.. ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రజలు ఈ మోడర్న్​ రైళ్లవైపు మొగ్గుచూపుతున్నారు!

సంబంధిత కథనం