India's first electric double decker bus : దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ఇదే..
India's first electric double decker bus : ముంబై రోడ్ల మీద ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు అందుకున్న నగరంగా ముంబై నిలిచింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
India's first electric double decker bus : దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు అందుకున్న నగరంగా ముంబై నిలిచింది. మంగళవారం ఉదయం.. ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బీఈఎస్టీ)లోకి చేరాయి. చాలా నెలల ఆలస్యం తరువాత ఇవి అందుబాటులోకి వచ్చాయి.
ట్రెండింగ్ వార్తలు
ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ఈఐవీ22 అని పిలుస్తున్నారు. మార్చ్ చివరి నాటికి దాదాపు 20 బస్సులు ముంబై రోడ్ల మీద తిరగనున్నాయి. అశోక్ లేల్యాండ్కు చెందిన ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికిల్ విభాగమైన స్విఛ్ మొబిలిటీ నుంచి బీఈఎస్టీ వీటిని లీజుకు తీసుకుంది. గతేడాది ఆగస్టు 17న.. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. అప్పటి నుంచి వీటిపై ప్రజల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది.
Electric double decker bus : ఇక ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసులో ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంది. ఆ వెంటనే ముంబై సబ్అర్బన్ రోడ్ల మీద ఇవి దర్శనమిస్తాయి. ముంబైలో ఇప్పటికే కొన్ని డబుల డెక్కర్ బస్సులు ఉన్నాయి. కాగా.. అవి డీజిల్తో నడుస్తున్నాయి. వాటిని భర్తీ చేస్తూ.. ఈ ఈఐవీ22ని తీసుకొచ్చారు అధికారులు.
"రానున్న కొన్ని రోజుల్లో మరో ఐదు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు చేరుతాయి. ఈ ఏడాది చివరి నాటికి 200కుపైగా ఈవీ డబుల్ డెక్కర్ బస్సులు మాకు దక్కుతాయి. అతి త్వరలోనే వీటిని ప్రజా సేవ కోసం అంకితం చేస్తాము," అని బీఈఎస్టీ జనరల్ మేనేజర్ లోకేశ్ చంద్ర తెలిపారు.
ఈఐవీ22 ఫీచర్స్..
Mumbai electric double decker bus :స్విఛ్ మొబిలిటీ రూపొందించిన ఈ ఈఐవీ22లో లిథియం- ఐయాన్ మాడ్యులర్ బ్యాటరీ ఆప్షన్స్ ఉంటాయి. లిక్విడ్ కూలింగ్ ఇంజిన్తో పాటు 231కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కెపాసిటీ వీటిల్లో ఉంటుంది. 1.5- 3 గంటల్లో బస్సులను ఛార్జ్ చేయవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు 250కి.మీల దూరం ప్రయాణిస్తాయి. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్.. 320 హెచ్పీ పవర్ను, 3100 ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తుంది.
మహారాష్ట్ర రాయ్గఢ్లో ఉన్న పాతాల్గంగాలోని స్విఛ్ మొబిలిటీలో ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తయారు చేస్తున్నారు. ఇందులో రెండు డోర్లు ఉంటాయి. పైకి వెళ్లేందుకు మెట్లు ఉంటాయి. డిజిటల్ టికెటింగ్, సీసీటీవీ కెమెరాలు, లైవ్ ట్రాకింగ్, డిజిటల్ డిస్ప్లే, పానిక్ బటన్ వంటి ఫీచర్స్ వీటిల్లో ఉంటాయి. 65 మంది ప్రయాణికుల కూర్చునే విధంగా వీటిని రూపొందించారు. నిలబడి ప్రయాణించేవారిని కూడా కలుపుకుంటే.. ఒకేసారి 100మంది కూడా ఇందులో ప్రయాణించవచ్చు.
First electric double decker bus : వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు గతేడాది అక్టోబర్లోనే అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ సర్టిఫికేషన్లో జాప్యం కారణంగా ఆలస్యమైంది.
సంబంధిత కథనం