పెట్టుబడి ఆధారిత కంపెనీ వ్యవస్థాపకుడు అనంత్ లాధా ఇటీవల ఆసియాలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీని కలిశారు. ఆ సందర్భంగా ముకేశ్ అంబానీతో జరిగిన క్లుప్త సంభాషణను లింక్డ్ఇన్ లో ఆయన పంచుకున్నారు. ఈ పోస్ట్ కొద్ది సేపట్లోనే వైరల్ గా మారింది. వేలాది లైక్స్ ను సాధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో కలిసి దిగిన రెండు ఫొటోలను కూడా ఆయన తన లింక్డ్ఇన్ పోస్ట్ లో షేర్ చేశారు. వారి సంభాషణ సారాంశాన్ని, ఒక క్యాప్షన్ ను జత చేశారు.
ముకేశ్ అంబానీతో కొద్దిసేపు సంభాషించినప్పుడు తాను ఒకే ఒక ప్రశ్న అడగగలిగానని పెట్టుబడి ఆధారిత స్టార్ట్ అప్ వ్యవస్థాపకుడు అనంత్ లాధా వెల్లడించారు. తాను ముకేశ్ అంబానీని "విజయం సాధించడానికి ఏమి కావాలి?" అనే చిన్న ప్రశ్నను అడిగానని వివరించాడు. అందుకు ముకేశ్ సూటిగా, క్లుప్తంగా ఈ జవాబు ఇచ్చారని వెల్లడించారు. ‘‘ఫోకస్, డెలిగేట్ అండ్ డైవర్సిఫై (Focus, delegate and diversify)’’ అని ముకేశ్ జవాబిచ్చారని వెల్లడించారు.
ముకేష్ అంబానీ సర్ ఇచ్చిన సరళమైన, ప్రభావవంతమైన సమాధానం ఇది అని ఆయన అభివర్ణించారు. అంబానీ ఫిలాసఫీలోని స్పష్టత, వివేకాన్ని ప్రశంసిస్తూ ఆయన పోస్ట్ చాలా మందిలో, ముఖ్యంగా ఔత్సాహిక వ్యాపార వర్గాల్లో వైరల్ గా మారింది.
ముకేశ్ అంబానీతో దిగిన రెండు ఫొటోలు, ఒక చిన్న సందేశం ఉన్న ఈ లింక్డ్ ఇన్ పోస్ట్ వేగంగా ట్రాక్షన్ పొందింది. 2,000కు పైగా లైక్ లను సంపాదించింది. కామెంట్ల సంఖ్య నామమాత్రంగానే ఉన్నప్పటికీ, కనిపించిన కొన్ని ప్రశంసలను, స్ఫూర్తిని ప్రతిబింబించాయి. ఒక యూజర్ దీనిని "అత్యంత గొప్ప సలహా’ అన్నారు. మరొకరు ఈ ఫోటోను "మిలియన్ డాలర్ల క్షణం" అని అభివర్ణించారు. "ఇది బంగారం లాంటి సలహా. చాలా మంది ఒకేసారి 100 వస్తువుల వెంటబడ్తారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ మాత్రం ఇలా అంటాడు: 3 పనులు బాగా చేయండి. అంతే అని" మూడో నెటిజన్ వ్యాఖ్యానించారు. మరొకరు ఇలా రాశారు, "ఇంత అద్భుతమైన వ్యాపార టైకూన్ ను కలవడం గొప్ప విజయం. కంగ్రాట్స్!" అన్నారు.
సంబంధిత కథనం
టాపిక్