టెక్ రంగంలో భారీ తొలగింపుల పరంపరను కొనసాగిస్తున్న మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు మళ్లీ దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఇది టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగుల్లో 3% గా ఉంటుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ ప్రకటన వెలువడింది.
2023లో మైక్రోసాఫ్ట్ దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత.. సంస్థలో ఇది రెండో అతిపెద్ద ఉద్యోగ కోత. పోటీని తట్టుకునేందుకు టెక్ దిగ్గజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు దృష్టి సారించడంతో, ఉద్యోగుల తొలగింపు నిర్ణయం అనివార్యమైంది. గత ఏడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్ లో 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేస్తుండగా, వీరిలో 55 శాతం మంది అమెరికాలోనే ఉన్నారు.
ఈ రౌండు ఉద్యోగాల కోత వల్ల ఎక్కువగా ప్రభావితమైన భౌగోళిక ప్రాంతాలలో వాషింగ్టన్ ఒకటి. ఇక్కడ 1,985 మంది ఉద్యోగులను రెడ్మండ్ లోని కంపెనీ ప్రధాన కార్యాలయానికి వెళ్లమని అడుగుతున్నారని ఎపి నివేదిక తెలిపింది. ఈ ఉద్యోగుల్లో ఎక్కువ మంది సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ లేదా ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ రోల్స్ లో ఉన్నారు. ప్రస్తుత లే ఆఫ్ ప్రక్రియ అన్ని టీమ్స్, లెవెల్స్, అన్ని కేటగిరీస్, అన్ని భౌగోళిక ప్రాంతాలలో ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ లే ఆఫ్ తో ప్రధానంగా కంపెనీలో మేనేజర్ల సంఖ్యను తగ్గించనున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ ఉద్యోగాల కోత మైక్రోసాఫ్ట్ వీడియో గేమింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ బాక్స్, దాని కెరీర్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ పై కూడా ప్రభావం చూపుతుంది.
డైనమిక్ మార్కెట్లో కంపెనీ విజయానికి అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూనే ఉన్నామని ఉద్యోగ కోతకు గల కారణాలపై కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో వాల్ స్ట్రీట్ అంచనాలను మించిన అమ్మకాలు, లాభాలను మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 70.1 బిలియన్ డాలర్ల ఆదాయం, 25.8 బిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని ప్రకటించింది.
సంబంధిత కథనం