Electric car : సింగిల్ ఛార్జ్తో 460 కి.మీ రేంజ్- ఈ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు ధర పెరిగింది!
MG ZS EV price hike : ఇండియాలో టాప్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన జెడ్ఎస్ ఈవీ ధరలను జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ సంస్థ భారీగా పెంచేసింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్స్లో ఒకటి.. ఎంజీ జెడ్ఎస్ ఈవీ! ఇప్పుడు ఈ ఈవీ ధరను పెంచుతున్నట్టు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ప్రకటించింది. ఈ పెంపు, ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. వేరియంట్ ఆధారంగా రూ.89,000 వరకు పెరిగింది! ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

ఎంజీ జెడ్ఎస్ ఈవీ: ఏ వేరియంట్ ధర ఎంత పెరిగింది?
ఇన్పుట్ కాస్ట్ పేరుతో గత రెండు నెలలుగా దేశంలోని దాదాపు అన్ని ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే జెడ్ఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ కూడా ఇప్పుడు ఎంజీ జెడ్ఎస్ ఈవీ ధరలను పెంచేసింది.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ టాప్-స్పెక్ ఎసెన్స్ డ్యూయెల్ టోన్ ఐకానిక్ ఐవరీ, ఎసెన్స్ డార్క్ గ్రే వేరియంట్లు అత్యధికంగా రూ.89,000 ధర పెరిగాయి. దీని తరువాత ఎక్స్క్లూజివ్ ప్లస్ డార్క్ గ్రే వేరియంట్ ప్రస్తుత ధర కంటే రూ .61,800 ప్రీమియంతో వస్తోంది. హ్యుందాయ్ క్రెటా ఈవీకి పోటీగా ఉన్న ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎక్స్క్లూజివ్ ప్లస్ డ్యూయల్ టోన్ ఐకానిక్ ఐవరీ, 100 ఇయర్స్ ఎడిషన్ వేరియంట్ల ధర రూ.61,000 పెరిగింది.
ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్సైట్ ప్రో వేరియంట్ ధర రూ.49,800 పెరిగింది. అయితే ఎంట్రీ లెవల్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు! ఈ ధరల పెంపుతో ఎంజీ జెడ్ఎస్ ఈవీ శ్రేణి ఇప్పుడు రూ .18.98 లక్షల నుంచి రూ .26.64 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ: రేంజ్..
ఎంజీ జెడ్ఎస్ ఈవీకి శక్తినిచ్చేది 50.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 174బీహెచ్పీ పవర్, 280ఎన్ఎమ్ పీక్ టార్క్ను జనరేట్ చేస్తుంది. జెడ్ఎస్ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కార్ల తయారీ సంస్థ పేర్కొంది.
ఎంజీ లైనప్ సూపర్..!
ఇండియాలో, ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాహనాల లైనప్లో జెడ్ఎస్ ఈవీ అగ్రస్థానంలో ఉంది. ఇందులో ఏడు విభిన్న వేరియంట్లు ఉన్నాయి.
ఎంజీ కామెట్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ వంటి మోడళ్లు కూడా ఈ శ్రేణిలో ఉన్నాయి. దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా కామెట్ ఈవీని భారతదేశంలో విడుదల చేశారు. ఏదేమైనా, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో2025 లో రూ .3.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో వైవే ఈవా ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడంతో.. కామెట్ ఈవీ ఇప్పుడు భారతదేశంలో రెండొవ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా మారింది.
సంబంధిత కథనం