460 కి.మీ వరకు రేంజ్​- ఏకంగా రూ. 4.44లక్షలు తగ్గిన ఎలక్ట్రిక్​ కారు ధర..-mg zs ev gets a massive price see details of this electric car here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  460 కి.మీ వరకు రేంజ్​- ఏకంగా రూ. 4.44లక్షలు తగ్గిన ఎలక్ట్రిక్​ కారు ధర..

460 కి.మీ వరకు రేంజ్​- ఏకంగా రూ. 4.44లక్షలు తగ్గిన ఎలక్ట్రిక్​ కారు ధర..

Sharath Chitturi HT Telugu

కొత్తగా ఎలక్ట్రిక్​ కారు కొనాలని చూస్తున్న వారికి అప్డేట్​! సింగిల్​ ఛార్జ్​తో 460 కి.మీ వరకు రేంజ్​ని ఇచ్చే ఎంజీ జెడ్​ఎస్​ ఈవీపై భారీ ప్రైజ్​ కట్​ని ప్రకటించింది సంస్థ. పూర్తి వివరాలు..

ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ

జెఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ భారతదేశంలో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని సెలబ్రేట్​ చేసుకునేందుకు వాహన తయారీదారు జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్​యూవీకి చెందిన అన్ని వేరియంట్లపై భారీగా ప్రైజ్​ కట్​ని ప్రకటించింది. 2025 ఎంజీ జెడ్ఎస్ ఈవీ ధర ఇప్పుడు రూ .4.44 లక్షల వరకు తగ్గింది. ప్రైజ్​ కట్​ అనంతరం జెడ్ఎస్ ఈవీ ధరలు ఇప్పుడు రూ. 16.75 లక్షల నుంచి ప్రారంభమై రూ .20.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ ధర తగ్గింపు టాటా కర్వ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా బీఈ 6, ఎంజీ విండ్సర్ ప్రో (ఫిక్స్​డ్​ బ్యాటరీ ఆప్షన్​) ను కూడా వెనక్కి నెట్టి జెడ్ఎస్ ఈవిని మరింత చౌకగా చేస్తుంది!

ఎంజీ జెడ్ఎస్ ఈవీ సవరించిన ధరలు..

ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ వేరియంట్లుకొత్త ధరలు (ఎక్స్​షోరూం)పాత ధరలు (ఎక్స్​షోరూం)వ్యత్యాసం
ఎగ్జిక్యూటివ్​ 16,75,000 16,88,000 13,000
ఎక్సైట్​ ప్రో 18,49,800 18,97,800 48,000
ఎక్స్​క్లూజివ్​ ప్లస్​ 19,49,800 23,64,800 4,15,000
ఎస్సెన్స్​ 20,49,800 24,93,800 4,44,000

ధరల తగ్గింపు గురించి జెఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ హెడ్ రాకేష్ సేన్ మాట్లాడుతూ.. “గత ఆరేళ్లుగా డైనమిక్ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్​లో గ్రోత్​ స్టోరీని రూపొందించడంలో మాకు సహాయపడిన మా కస్టమర్లు, ఇతర సంబంధిత వాటాదారులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. కంపెనీ పునాది ఆవిష్కరణపై ఆధారపడి ఉంది. జెడ్ఎస్ ఈవీ 2020లో ఎంజీ బ్రాండ్ నిజంగా ఏమి చేయగలదో నిజమైన సాక్ష్యంగా నిలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ఆవిష్కరణలను చేర్చడం ద్వారా సాంప్రదాయ మొబిలిటీని పునర్నిర్వచించిన కారు ఇది. భారతదేశంలో మా ఆరొవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. స్టైలిష్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీకి అప్ గ్రేడ్ కావాలనుకునే వినియోగదారులకు ఎంజీ జెడ్ఎస్ ఈవీని మరింత అందుబాటులోకి తీసుకువచ్చాము. మా ఇతర రెండు ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికే అందుబాటు ధర వద్ద ఉన్నాయి. ఈ ప్రత్యేక ధరతో, జెడ్ఎస్ ఈవీ ప్రీమియం రైడ్ కోరుకునే వినియోగదారులను కూడా ఆకర్షిస్తుంది. ఆకర్షణీయమైన మొత్తం ప్యాకేజింగ్, ధరతో.. ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఖచ్చితంగా భారతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని మేము నమ్ముతున్నాము,” అని అన్నారు.

ఎంజీ జెడ్​ఎస్​ ఈవీలోని 50.3 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 461 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది.

కాగా ధర తగ్గింపుతో జెడ్ఎస్ ఈవీ కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మారుతుంది. రాబోయే వారాల్లో దాని అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.

జేస్​ఎడబ్ల్యూ ఎంజీ ఎలక్ట్రిక్​ కార్లు..

ఎంజీ జెడ్ఎస్ ఈవీ భారతదేశంలో బ్రాండ్ నుంచి వచ్చిన రెండవ ఆఫర్. గత ఆరు నెలల్లో సగటున 600 యూనిట్లను విక్రయిస్తోంది. ముఖ్యంగా, ఎంజీ మరొక ఎలక్ట్రిక్ ఆఫర్, విండ్సర్ ఈవీ, మార్కెట్​లో ఇతర ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మాత్రమే కాకుండా జెడ్ఎస్ ఈవీ అమ్మకాలను కూడా లాగేసుకుందని చెప్పుకోవాలి! గత ఆరు నెలల్లో ఎంజీ విండ్సర్ ఈవీ సగటున 3,450 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం సెప్టెంబర్​లో లాంచ్ చేసినప్పటి నుంచి ఈ మోడల్​ 27,000 యూనిట్లకు పైగా సేల్​ అయింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం