న్యూక్లియర్ పవర్ రంగంలోకి మేఘా ఇంజినీరింగ్, రూ.12,800 కోట్ల అణు రియాక్టర్ల ఆర్డర్ కైవసం-megha engineering enters nuclear power sector wins npcil order to build nuclear reactors ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  న్యూక్లియర్ పవర్ రంగంలోకి మేఘా ఇంజినీరింగ్, రూ.12,800 కోట్ల అణు రియాక్టర్ల ఆర్డర్ కైవసం

న్యూక్లియర్ పవర్ రంగంలోకి మేఘా ఇంజినీరింగ్, రూ.12,800 కోట్ల అణు రియాక్టర్ల ఆర్డర్ కైవసం

ఎన్పీసీఐఎల్ కు రెండు అణు రియాక్టర్లను నిర్మించేందుకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ పర్చేజ్ ఆర్డర్ పొందింది. రూ.12,800 కోట్లతో ఈ రెండు అణు రియాక్టర్లను ఎంఈఐఎస్ నిర్మించనుంది. ఒక్కో రియాక్టర్ సామర్థ్యం 700 మెగావాట్స్ ఎలక్ట్రిక్ సామర్థ్యం కలిగి ఉంటుంది.

న్యూక్లియర్ పవర్ రంగంలోకి మేఘా ఇంజినీరింగ్, రూ.12,800 కోట్ల అణు రియాక్టర్ల ఆర్డర్ కైవసం

కర్ణాటక రాష్ట్రంలోని కైగా వద్ద 700 మెగావాట్స్ ఎలక్ట్రిక్ సామర్థ్యం కలిగిన రెండు అణు రియాక్టర్ యూనిట్ల నిర్మాణానికి పర్చేజ్ ఆర్డర్ ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) బుధవారం అందుకుంది. ముంబయిలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్) సీనియర్ అధికారుల నుంచి పర్చేజ్ ఆర్డర్ ను ఎంఈఐఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సి.హెచ్. సుబ్బయ్య అందుకున్నారు.

కైగా యూనిట్లు 5, 6 అణు రియాక్టర్లను ఎన్పీసీఐఎల్ కోసం ఎంఈఐఎల్ నిర్మించనుంది. రూ.12,800 కోట్లతో రెండు అణు రియాక్టర్లన ఎంఈఐఎల్ నిర్మించనుంది.

ఎంఈఐఎల్ కు ఈపీసీ కాంట్రాక్ట్

ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో ఎంఈఐఎల్ ఈ అణు రియాక్టర్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. ఇప్పటి వరకు ఎన్పీసీఐఎల్ ఏకమొత్తంగా ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్ ఇదే. బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టి వంటి ఇతర ప్రముఖ బిడ్డర్లతో పోటీ పడి ఈ కాంట్రాక్టును ఎంఈఐఎల్ దక్కించుకోవడం విశేషం.

ఈ ప్రతిష్టాత్మక ఈపీసీ కాంట్రాక్ట్ ఎంఈఐఎల్ కు లభించడం, భారతదేశ ఇంధన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కంపెనీ చేస్తున్న కృషిని తెలియజేస్తోంది.

మొట్టమొదటిసారిగా ఈ టెండర్ ప్రక్రియలో క్వాలిటీ-కమ్-కాస్ట్-బెస్డ్ సెలెక్షన్ (క్యూసీబీఎస్) విధానాన్ని ఎన్పీసీఐఎల్ అవలంబించింది. టెండర్ కేటాయింపులో సాంకేతిక నైపుణ్యం, ఖర్చు సామర్థ్యం రెండింటినీ సమతుల్యంగా అంచనా వేసింది.

అణురంగంలోకి వ్యూహాత్మక ప్రవేశం

పర్చేజ్ ఆర్డర్ ను అందుకున్న సందర్భంగా ఎంఈఐఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సుబ్బయ్య మాట్లాడుతూ తమ సంస్థ అత్యుత్తమ సాంకేతిక సామర్థ్యానికి, పోటీ తత్వానికి ఈ కాంట్రాక్టు సాధించటం ఓ నిదర్శనం అన్నారు.

కైగా అణు రియాక్టర్ల నిర్మాణ ప్రాజెక్ట్ దేశ ఇంధన భవిష్యత్తుకు కీలకమైన అణు ఇంధన రంగంలోకి తమ సంస్థ వ్యూహాత్మక ప్రవేశాన్ని సూచిస్తుందని, ఎంఈఐఎల్ కు ఇంజినీరింగ్ నైపుణ్యం, ఆవిష్కరణల పట్ల ఉన్న నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు.

దేశ స్వావలంబనలో కీలక పాత్ర

తాము అత్యున్నత ప్రమాణాలు, భద్రత, విశ్వసనీయతకు కట్టుబడి ఉంటూనే, ప్రాజెక్ట్ను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామన్న విశ్వాసాన్ని సుబ్బయ్య వ్యక్తం చేశారు. దేశ, విదేశాలలో పెద్ద ఎత్తున ఈపీసీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన బలమైన ట్రాక్ రికార్డ్ తో, అణు శక్తి రంగంలో దేశ స్వావలంబనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించడానికి ఎంఈఐఎల్ సిద్ధంగా ఉందని సుబ్బయ్య తెలిపారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం