Electric cars : ఈ ఎలక్ట్రిక్​ కార్ల కోసమే ఇండియాలో అందరు వెయిటింగ్​! రేంజ్​ 400 కి.మీ పైనే..-maruti suzuki e vitara to mg m9 exciting electric cars ready for india launch ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Cars : ఈ ఎలక్ట్రిక్​ కార్ల కోసమే ఇండియాలో అందరు వెయిటింగ్​! రేంజ్​ 400 కి.మీ పైనే..

Electric cars : ఈ ఎలక్ట్రిక్​ కార్ల కోసమే ఇండియాలో అందరు వెయిటింగ్​! రేంజ్​ 400 కి.మీ పైనే..

Sharath Chitturi HT Telugu

ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న 3 ఎలక్ట్రిక్​ వాహనాలపై మంచి బజ్​ ఉంది. అవి.. మారుతీ సుజుకీ ఈ విటారా, ఎంజీ ఎం9 ఎంపీవీ, ఎంజీ సైబర్​స్టర్​. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సూపర్​ స్టైలిష్​ ఎంజీ సైబర్​స్టర్​ (MG Motor)

ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాలకు కనిపిస్తున్న డిమాండ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు కొత్త కొత్త మోడల్స్​ని లాంచ్​ చేస్తున్నాయి. అయితే, రానున్న రోజుల్లో లాంచ్​కానున్న 3 మోడల్స్​పై ఇండియాలో మంచి బజ్​ ఉంది. అవి.. మారుతీ సుజుకీ ఈ విటారా, ఎంజీ ఎం9 ఎంపీవీ, ఎంజీ సైబర్​స్టర్​. రాబోయే కొన్ని వారాల్లో భారతదేశంలో లాంచ్ అవుతున్న ఈ మోడల్స్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

మారుతీ సుజుకీ ఈ విటారా..

భారతదేశంలో త్వరలో విడుదల కానున్న అత్యంత ఎగ్జైటింగ్​ కార్లలో మారుతీ సుజుకీ ఈ విటారా ఒకటి. ఇది బ్రాండ్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. మారుతీ సుజుకీ ఇప్పటికే ఈ విటారాను 2025 ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించింది. ఈ ఎస్​యూవీపై గత కొంత కాలంగా రోడ్ టెస్ట్​లు జరుగుతున్నాయి. ఇది త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఈవీ మారుతీ సుజుకీ ప్రీమియం రిటైల్ నెట్​వర్క్​ నెక్సా ద్వారా అమ్మకాలకు వెళుతుంది. మారుతీ సుజుకీ ఈ విటారాలో 49 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఇది 142 బీహెచ్​పీ పీక్​ పవర్​ని, 192.5 ఎన్ఎమ్ పీక్​ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీని ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

ఎంజీ ఎం9..

ఎంజీ ఎం9 అనేది ప్రీమియం ఎలక్ట్రిక్ ఎంపీవీ. ఇది కియా కార్నివాల్​కు సమానమైన పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఎంజీ ఎం9ని ఆటో ఎక్స్​పో 2025లో ప్రదర్శించారు. భారతదేశంలో విడుదలను సంస్థ ధ్రువీకరించింది. ప్రపంచవ్యాప్తంగా మాక్సస్ మిల్ఫా 9గా పిలుస్తున్న ఈ ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ ఎంపీవీ భారతదేశంలో వాహన తయారీదారుల ప్రీమియం రిటైల్ నెట్​వర్క్​ ఎంజి సెలెక్ట్ ద్వారా అమ్మకాలకు వెళుతుంది. ఇది ఎంజీ సైబర్​స్టర్​ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును కూడా విక్రయించనుంది. ఎంజీ ఎం9లో ఏడుగురు ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ఈ ఎలక్ట్రిక్ వాహనం 90 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో పనిచేస్తుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే 430 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుంది.

ఎంజీ సైబర్​స్టర్..

ఇండియాలో మచ్​ అవైటెడ్​ ఎలక్ట్రిక్​ కార్లలో ఈ ఎంజీ సైబర్​స్టర్ ముందువరుసలో ఉంటుంది. ఇది త్వరలో భారత మార్కెట్లో విడుదల కానున్న మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారును ఎంజీ ఎం9 తో పాటు ఆటో ఎక్స్​పో 2025 లో ప్రదర్శించారు. దీనితో పాటు సైబర్​స్టర్ ఎంజీ సెలెక్ట్ ప్రీమియం రిటైల్ నెట్​వర్క్ ద్వారా అమ్మకానికి వెళుతుంది. టూ-డోర్ స్పోర్ట్స్ కారు ఆటోమొబైల్ సంస్థ నుంచి వస్తున్న అత్యంత శక్తివంతమైన ప్రొడక్షన్-స్పెక్ మోడల్. ఇది ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పుష్కలమైన ఫీచర్లతో అప్ మార్కెట్ క్యాబిన్​ను ప్యాక్ చేస్తుంది. ఇందులో 77 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే 443 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఎంజీ సైబర్​స్టర్ గరిష్టంగా 503 బీహెచ్​పీ పవర్, 725ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం