మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీపై బిగ్​ అప్డేట్​- డెలివరీ ఎప్పటి నుంచి అంటే..-maruti suzuki e vitara deliveries to start in september check out further details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీపై బిగ్​ అప్డేట్​- డెలివరీ ఎప్పటి నుంచి అంటే..

మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీపై బిగ్​ అప్డేట్​- డెలివరీ ఎప్పటి నుంచి అంటే..

Sharath Chitturi HT Telugu

మారుతీ సుజుకీ తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఈ విటారాపై కీలక అప్డేట్​ని షేర్​ చేసింది. మే లేదా జూన్​లో ఈ మోడల్​ని లాంచ్​ చేస్తామని, సెప్టెంబర్ 2025 నాటికి భారతదేశంలో డెలివరీలు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మారుతీ సుజుకీ ఈ విటారా (ANI)

మచ్​ అవైటెడ్​ ఈ విటారా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీపై కీలక అప్డేట్​ ఇచ్చింది మారుతీ సుజుకీ సంస్థ. ఈ విటారాను భారత దేశంతో పాటు ఎగుమతి మార్కెట్​లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు 2025 సెప్టెంబర్​లో డెలివరీలు మొదలవుతాయని స్పష్టం చేసింది.

మారుతీ సుజుకీ ఈ విటారా..

దేశీయ దిగ్గజం మారుతీ సుజుకీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఈ ఈ విటారా. 2025 ఆటో ఎక్స్​పోలో సంస్థ దీనిని ప్రదర్శించింది. ఈ ఆల్​- ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ అందరిని ఆకర్షించింది.

మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్.సీ.భార్గవ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విటారా డెలివరీలు 2025 సెప్టెంబర్ నాటికి భారతదేశంలో ప్రారంభమవుతాయని ధృవీకరించారు. ఈ ఏడాది 70,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ అధికారులు మీడియాకు తెలిపారు. మొత్తం 70,000 యూనిట్లలో ఎక్కువ యూనిట్లను ఎగుమతి మార్కెట్లకు కేటాయించనున్నారు. మిగిలిన యూనిట్లను దేశీయంగా విక్రయించి డిమాండ్​కు అనుగుణంగా పరీక్షించనున్నారు.

ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని మే లేదా జూన్​లో లాంచ్ చేసే అవకాశం ఉంది! ప్రత్యేక డీలర్​షిప్​ల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించే యోచన లేదని, అమ్మకాల కోసం ప్రస్తుత సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటామని మారుతీ సుజుకీ ధృవీకరించింది.

లాంచ్​ తర్వాత ఈ మారుతీ సుజుకీ ఈ విటారా టాటా నెక్సాన్​ ఈవీ, హ్యుందాయ్​ క్రెటా వంటి వాటికి గట్టి పోటీని ఇవ్వనుంది.

త్వరలో మరో ఎస్​యూవీ?

మారుతీ సుజుకీ నుంచి ఈ ఏడాది చివరిలో మరో ఎస్​యూవీ రాబోతోందని సమచారం. తమ పోర్ట్​ఫోలియోలో మరో ఎస్​యూవీ చేరుతుందని ఛైర్మన్ ఆర్.సీ. భార్గవ తెలిపారు. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ఏడు సీట్ల వెర్షన్ భారతీయ రోడ్లపై స్పాట్ టెస్టింగ్ గురించి అనేక నివేదికలు వచ్చాయి. రాబోయే ఈ ఎస్​యూవీ ఇదే కావచ్చు!

స్పై షాట్లలో, గ్రాండ్ విటారా సెవెన్-సీటర్ ఎస్​యూవీ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేసే ఫ్రీ-స్టాండింగ్ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టెమ్​ని కలిగి ఉంది. గ్రాండ్ విటారా సెవెన్ సీటర్ క్యాబిన్​లో ఇతర మార్పులు కూడా ఆశించవచ్చు. వీటిలో కొద్దిగా రీడిజైన్ చేసిన డ్యాష్​బోర్డ్​తో పాటు కొత్త కలర్ షేడ్, కొత్త అప్​హోల్​స్టరీ ఉన్నాయి.

అన్ని మారుతీ కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు..

ఈ ఏడాది చివరి నాటికి అన్ని మారుతీ సుజుకీ కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులను ప్రామాణికంగా అప్​డేట్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇటీవల, కార్ల తయారీదారు ఎంవై 2025 గ్రాండ్ విటారా, ఎంవై 2025 వ్యాగన్ఆర్​లకు ఈ భద్రతా ఫీచర్​ని జోడించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం