బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీపై బిగ్​ అప్డేట్​- ధర పెంపుతో పాటు ఆ వేరియంట్లు కట్​!-mahindra xuv700 lineup updated 5 seater variants discontinued price hiked ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీపై బిగ్​ అప్డేట్​- ధర పెంపుతో పాటు ఆ వేరియంట్లు కట్​!

బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీపై బిగ్​ అప్డేట్​- ధర పెంపుతో పాటు ఆ వేరియంట్లు కట్​!

Sharath Chitturi HT Telugu

మహీంద్రా ఎక్స్​యూవీ700 ఎస్​యూవీలో భారీ మార్పులు చేసింది సంస్థ. 5 సీటర్​ వేరియంట్లను తొలగించింది. అంతకాదు, వాహనాల ధరలను సైతం పెంచేసింది. పూర్తి వివరాలు..

మహీంద్రా ఎక్స్​యూవీ700 (HT Auto/Sabyasachi Dasgupta)

బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీగా గుర్తింపు తెచ్చుకున్న ఎక్స్​యూవీ700పై బిగ్​ అప్డేట్​! ఈ మోడల్​లోని అన్ని 5 సీటర్​ వేరియంట్స్​ని సంస్థ తొలగించింది. ఫలితంగా, ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎస్​యూవీ కేవలం 6,7 సీట్ల కాన్ఫిగరేషన్​తో మాత్రమే అందుబాటులో ఉండనుంది. లైనప్​లో మార్ప్​తో పాటు మహీంద్రా ఎక్స్​యూవీ700 ధర కూడా పెరిగింది. బేస్ ధర ఇప్పుడు రూ .14.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇంతకుముందు ధర రూ .13.99 లక్షలుగా ఉండేది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

బెస్ట్​ ఫ్యామిలీ ఎస్​యూవీలో మార్పులు..

ఈ అప్డేట్​తో మహీంద్రా ఎక్స్​యూవీ700 బేస్ ఎంఎక్స్ వేరియంట్ నుంచి ఈబోనీ ఎడిషన్ ఫీచర్ ప్యాక్డ్ ఏఎక్స్7 ఎల్ వరకు మొత్తం 43 విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. లేటెస్ట్​గా వచ్చిన ఈబోనీ ఎడిషన్ విజువల్ వాల్యూ, ప్రీమియం షైన్​ని ఫ్యామిలీ ఎస్​యూవీ టాప్-ఆఫ్-లైన్ ట్రిమ్​లకు జోడిస్తుంది.

అప్​డేటెడ్ ఎంట్రీ లెవల్ మోడల్ ఎంఎక్స్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్. ఇప్పటివరకు 5 సీట్ల లేఔట్​లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వేరియంట్​ ఇప్పుడు 7 సీటర్​ ఆప్షన్​ని పొందింది. ఏఎక్స్7ఎల్ డీజిల్ ఆటోమేటిక్ ఈబోనీ ఎడిషన్ అత్యంత ప్రీమియం ఫీచర్లతో అగ్రస్థానంలో ఉంది. 7 సీట్ల లేఔట్​ కూడా పొందుతుంది. తాజా అప్డేట్​తో మహీంద్రా ఎక్స్​యూవీ700 ఎక్స్​షోరూం ధరలు ఇప్పుడు బేస్ ఎంఎక్స్ పెట్రోల్ 7 సీటర్ వెర్షన్ ధర రూ .14.49 లక్షలు, ఏఎక్స్7 ఎల్ ఏడబ్ల్యూడీ ఈబోనీ ఎడిషన్ ధర రూ .25.15 లక్షలు.

మహీంద్రా ఎక్స్​యూవీ700: స్పెసిఫికేషన్లు..

మహీంద్రా ఎక్స్​యూవీ700 పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ మోడల్ 2.0-లీటర్ ఎంస్టాలియన్ ఇంజిన్​ని పొందుతుంది. ఇది 197 బీహెచ్​పీ పవర్, 380 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ 152బీహెచ్​పీ పవర్, 360ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇందులోని మరొక డీజిల్ ఇంజిన్ 182బీహెచ్​పీ పవర్, 420ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మహీంద్రా ఎక్స్​యూవీ700లో ట్రాన్స్​మిషన్ డ్యూటీ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ద్వారా జరుగుతుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ700: ఫీచర్లు..

మహీంద్రా ఎక్స్​యూవీ700లో ఇన్​స్టరుమెంట్ కన్సోల్, ఇన్ఫోటైన్​మెంట్ సిస్టెమ్ కోసం 10.25 ఇంచ్​ ట్విన్ స్క్రీన్​లు ఉన్నాయి. అడ్రినోఎక్స్ యూజర్ ఇంటర్ఫేస్, అలెక్సా బిల్ట్-ఇన్ ఫంక్షనాలిటీ, సోనీ సౌండ్ సిస్టమ్, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్​రూఫ్, వాయిస్ కమాండ్స్, యాంబియంట్ లైటింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

వెంటిలేటెడ్ సీట్స్​, మెమరీ ఫంక్షన్​తో ఓఆర్​వీఎంలు, 13 కొత్త ఫీచర్ అప్డేట్స్​తో ఓటీఏ అప్డేట్స్​, కొత్త నాపోలీ బ్లాక్ షేడ్​ని 2024లో ఈ ఎస్​యూవీకి సంస్థ అందించింది. ఎక్స్​యూవీ700 ఇప్పుడు రెండు తాజా చేర్పులతో మొత్తం మీద తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం