Mahindra XUV700: మహీంద్రా అండ్ మహీంద్రా తన టాప్ ఎక్స్యూవీ 700 వేరియంట్ ఎక్స్యూవీ 700 ఎఎక్స్ 7 కోసం కొత్త ధరను ప్రకటించింది. ఎక్స్ యూవీ 700 మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఎఎక్స్ 7 వేరియంట్ కొత్త ధరను ప్రకటించింది. ఈ ఎస్ యూవీ ఇటీవల 200,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని సాధించింది. కంపెనీ ఇటీవల డీప్ ఫారెస్ట్, బర్న్ సియెన్నా అనే రెండు కొత్త రంగులను ప్రకటించింది. వీటితో ఎక్స్యూవీ 700 ఏఎక్స్7 (Mahindra XUV700 AX7) తొమ్మిది విలక్షణమైన రంగుల్లో లభ్యమవుతుంది.
ఎక్స్ యూవీ 700 ఎఎక్స్ 7 వేరియంట్ కొత్త ధరను కంపెనీ రూ.19.49 లక్షలకు తగ్గించింది. ఈ వేరియంట్ అసలు ధర రూ.21.54 లక్షలు. మహీంద్రా ఎక్స్ యూవీ 700 పూర్తి లోడెడ్ ఏఎక్స్ 7 (Mahindra XUV700 AX7) శ్రేణి ప్రస్తుతం 19.49 లక్షల నుంచి ప్రారంభమవుతుందని, అత్యాధునిక ప్రీమియం ఫీచర్లతో సాటిలేని డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మంది కస్టమర్లకు అందించడానికి వీలు కలుగుతుందని మహింద్ర అండ్ మహింద్ర సంస్థ తెలిపింది.
ఈ మోడల్ (Mahindra XUV700 AX7) పై కొత్తగా ప్రకటించిన ధర జూలై 10 వ తేదీ నుండి నాలుగు నెలల కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని మహింద్ర అండ్ మహింద్ర (Mahindra and Mahindra) కంపెనీ తెలిపింది. అంటే, మహింద్ర ఎక్స్యూవీ ఏఎక్స్7 వేరియంట్ ను ఆసక్తి ఉన్న కస్టమర్లు 2024 జూలై 10వ తేదీ నుంచి 2024 నవంబర్10వ తేదీ వరకు కొనుగోలు చేయవచ్చు.
టాపిక్