Electric Car : సింగిల్ ఛార్జింగ్‌తో 400 కిలోమీటర్లకుపైగా రేంజ్ ఇచ్చే మహీంద్రా ఎలక్ట్రిక్ కారు!-mahindra xuv 3xo electric car spotted testing again see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Car : సింగిల్ ఛార్జింగ్‌తో 400 కిలోమీటర్లకుపైగా రేంజ్ ఇచ్చే మహీంద్రా ఎలక్ట్రిక్ కారు!

Electric Car : సింగిల్ ఛార్జింగ్‌తో 400 కిలోమీటర్లకుపైగా రేంజ్ ఇచ్చే మహీంద్రా ఎలక్ట్రిక్ కారు!

Anand Sai HT Telugu

Mahindra XUV 3Xo Electric Car : ఎలక్ట్రిక్ కార్లకు భారతీయ వినియోగదారుల్లో డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు ఈవీలను మార్కెట్‌లోకి తీసుకొస్తు్న్నాయి. మహీంద్రా కూడా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో రోజురోజుకు ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈవీలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. ఇతర వేరియంట్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తున్నాయి. మహీంద్రా కూడా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు విడుదలకు ముందు మరోసారి మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ టెస్టింగ్ సమయంలో కనిపించింది. మహీంద్రా ఈవీ మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ వంటి ఎస్‌యూవీలతో పోటీ పడుతుంది.

టెస్టింగ్ సమయంలో

పరీక్ష సమయంలో లీకైన ఈవీ స్పై షాట్లు న్యూస్ వెబ్‌సైట్ రష్లేన్లో ప్రచురితమైంది. వార్తా నివేదిక ప్రకారం రాజ్కోట్-అహ్మదాబాద్ హైవేపై ఈవీ కనిపించింది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని షీట్ మెటల్ ప్యానెల్స్, ప్లాస్టిక్ ట్రిమ్‌లు ఐసీఈ వంటివి ఉన్నాయి. ఎక్స్‌యూవీ 400 మాదిరిగానే ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ ఛార్జింగ్ పోర్ట్ ముందు భాగంలో ఎడమ క్వార్టర్ ప్యానెల్‌లో ఉంటుంది.

ఫీచర్లు!

10.2 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.2 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ఏడీఏఎస్, 360 డిగ్రీల కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. పవర్‌‌ట్రెయిన్‌గా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ 34.5 కిలోవాట్లు, 39.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది. మీడియా నివేదికల ప్రకారం, ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించగలదు.

ఆస్ట్రేలియాలో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ 2024లో భారత మార్కెట్లోకి విడుదలైంది. ఇప్పుడు ఈ సబ్-కాంపాక్ట్ వాహనం త్వరలో ఆస్ట్రేలియాలోకి ఎంట్రీ ఇస్తుంది. లాంచ్‌కు ముందు ఈ వాహనం మెల్‌బోర్న్ మోటార్ షోలో అరంగేట్రం అవుతుంది. ఈ సంవత్సరం మధ్యలో అమ్మకానికి రానుంది. ఈ ఎస్‌యూవీ మార్కెట్లో ఇప్పటికే స్థిరపడిన హ్యుందాయ్ వెన్యూ, టయోటా యారిస్ క్రాస్, మాజ్డా CX-3 వంటి ప్రత్యర్థులతో పోటీపడుతుంది.

ధరల వివరాలలోకి వెళితే మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ధర ఆస్ట్రేలియాలో సుమారు రూ. 16.40 లక్షలు కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. భారతీయ మార్కెట్లో వాహనం రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ 10.25-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అదే పరిమాణంలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి లక్షణాలతో నిండి ఉంది. దీనితో పాటు ఇది సెగ్మెంట్‌లోని అతిపెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌లలో ఒకటి. బ్రాండ్ అడ్రినోఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏడు-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, మరిన్నింటిని కలిగి ఉంది. వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, మరిన్ని వంటి ఫీచర్లు ఉన్నాయి.

Anand Sai

eMail

సంబంధిత కథనం