LPG cylinders price hike: ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచిన చమురు కంపెనీలు; ఈ సారి ఎంతంటే?-lpg cylinders price hike oil marketing companies raise lpg gas price by 6 rupees per cylinder ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lpg Cylinders Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచిన చమురు కంపెనీలు; ఈ సారి ఎంతంటే?

LPG cylinders price hike: ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచిన చమురు కంపెనీలు; ఈ సారి ఎంతంటే?

Sudarshan V HT Telugu

LPG cylinders price hike: ఎల్పీజీ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు నెలవారీ ధరల సమీక్షలో భాగంగా, వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. ఈ ధరల్లో రాష్ట్రాలవారీగా కొంత తేడా ఉంటుంది.

మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర

LPG cylinders price hike: చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ల రేటును, ఒక్కో సిలిండర్ పై రూ .6 మేరకు పెంచాయి. ఈ పెంపు తరువాత, 19 కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర రూ. 1,797 నుండి రూ. 1,803 కు పెరిగింది.

మెట్రో నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ ధర

ఫిబ్రవరిలో చమురు కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ .7 తగ్గించిన తరువాత, ఇప్పుడు మళ్లీ ఒక్కో సిలిండర్ పై రూ. 6 పెంచాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలపై ప్రభావం చూపుతుంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు 2023 మార్చిలో రూ .352 పెరిగాయి. కాగా, గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలను ఈ మధ్య కాలంలో సవరించలేదు. ఇవి గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్నాయి. ఈ సారి కూడా డొమెస్టిక్ సిలిండర్ల ధరలను పెంచలేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు 2024 ఆగస్టు నుండి మారలేదు. కొత్త ధరలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తాయి. వీటిని ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాల్లో వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తారు.

వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా..

ఈ నాలుగు మెట్రో నగరాలకు పేర్కొన్న ధరతో పోలిస్తే మీ నగరంలో ఎల్పిజి ధర వేరుగా ఉండవచ్చు. మీ నగరంలో ఖచ్చితమైన ధర తెలుసుకోవడానికి స్థానిక గ్యాస్ ఆపరేటర్లను సంప్రదించడం మంచిది. ప్రధానంగా స్థానిక పన్నులు, రవాణా ఖర్చులలో వ్యత్యాసం కారణంగా ఎల్పీజీ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి.

మెట్రో నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ ధర
మెట్రో నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ ధర (Indian Oil )
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.