ఎల్​పీజీ సిలిండర్​ ధరల్లో మార్పు- హైదరాబాద్​లో రేటు ఎంతంటే..-lpg cylinder became cheaper by this much check latest rates here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎల్​పీజీ సిలిండర్​ ధరల్లో మార్పు- హైదరాబాద్​లో రేటు ఎంతంటే..

ఎల్​పీజీ సిలిండర్​ ధరల్లో మార్పు- హైదరాబాద్​లో రేటు ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

జూన్​ 1న ఎల్​పీజీ సిలిండర్​ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో డొమెస్టిక్​, కమర్షియల్​ ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధరలను ఇక్కడ తెలుసుకోండి..

ఈసారి ఎల్​పీజీ సిలిండర్ ధర పెరిగిందా? తగ్గిందా? (Shutterstock)

ఎల్​పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల కొత్త రేట్లు విడుదలయ్యాయి. ఈ రేట్ల ప్రకారం, 19 కిలోల కమర్షియల్ ఎల్​పీజీ సిలిండర్ ధర తగ్గింది. నేడు దిల్లీ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ సిలిండర్ ధర సుమారు రూ.25 తగ్గింది.

కాగా ఇళ్లల్లో వినియోగించే డొమెస్టిక్​ గ్యాస్ సిలిండర్​ ధరల్లో మార్పు లేదు. ఏప్రిల్​ నుంచి ఈ సిలిండర్​ ధరలు ఒకే విధంగా కొనసాగుతున్నాయి.

ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం, 19 కిలోల ఎల్​పీజీ సిలిండర్ ధర ఇప్పుడు దిల్లీలో రూ .1723.50 కు లభిస్తుంది. ఇంతకుముందు ఇది రూ .1747.50 కు అందుబాటులో ఉంది. ఇక కోల్​కతాలో కమర్షియల్ సిలిండర్ నేటి నుంచి రూ.1851.50కి బదులు రూ.1826కు అందుబాటులోకి రానుంది.

తాజా తగ్గింపుతో ముంబైలో సిలిండర్ ధర రూ.1674.50కు చేరింది. గతంలో అంటే మే నెలలో రూ.1699కే అందుబాటులో ఉండేది. ఇక చెన్నై విషయానికొస్తే, కమర్షియల్ సిలిండర్ గతంలో రూ.1906కు అందుబాటులో ఉండగా, ఇప్పుడు రూ.1881కి అందుబాటులోకి రానుంది.

ఇక హైదరాబాద్​లో కమర్షియల్​ ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ. 1,969.00గా కొనసాగుతోంది.

ఈ ధరలను ఎలా నిర్ణయిస్తారు?

ముడి చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్-సరఫరాను బట్టి వాణిజ్య సిలిండర్ల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఉదాహరణకు, మే 2025 లో, దిల్లీలో 19 కిలోల సిలిండర్ రూ .1,747.50గా ఉంది. ఇది ఏప్రిల్ కంటే రూ .17 చౌకగా మారింది. ఇప్పుడు జూన్​లో రూ.1723.50కు తగ్గింది.

ప్రతి నెల మొదటి రోజున చమురు మార్కెటింగ్​ సంస్థలు ధరలను పెంచడం, తగ్గించడం లేదా యథావిథిగా వదిలేయడం చేస్తుంటాయి.

ప్రధాన నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధరలు..

పట్నా- రూ. 942.5

లక్నో- రూ. 890.5

జైపూర్- రూ. 856.5

ఆగ్రా- రూ. 865.5

మీరట్- రూ. 860

ఘజియాబాద్ - రూ.850

ఇండోర్- రూ. 881

భోపాల్- రూ. 858.5

లుధియానా- రూ. 880

వారణాసి- రూ. 916.5

గురుగ్రామ్- రూ. 861.5

అహ్మదాబాద్- రూ. 860

పుణె- రూ. 856

విజయవాడ- రూ. 877.50

బెంగళూరు- రూ. 855.5

చెన్నై- రూ. 868.50

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం