Electric vehicles launch : 2024లో లాంచ్కు సిద్ధమవుతున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Electric vehicles launch in 2024 : వచ్చే ఏడాదిలో కొన్ని టాప్ ఈవీలు లాంచ్ అవుతున్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
2024 Electric vehicles launch : 2023 ఏడాది ముగింపు దశకు చేరుకుంటోంది. ఇక ఆటోమొబైల్ సంస్థలు.. 2024పై ఫోకస్ చేశాయి. వచ్చే ఏడాదిలో సరికొత్త మోడల్స్.. రోడ్లపై దర్శనమివ్వనున్నాయి. మరీ ముఖ్యంగా.. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో.. 2024లో కూడా హడావుడి కొనసాగనుంది. అనేక సంస్థలు.. కొత్త కొత్త ఈవీలను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో లాంచ్కానున్న ఈవీల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ క్రేటా ఈవీ..
హ్యుందాయ్ క్రేటా ఫేస్లిఫ్ట్తో పాటు ఎలక్ట్రిక్ వెహికిల్పైనా బజ్ నెలకొంది. డిజైన్ పరంగా ఈ రెండు ఒకే విధంగా ఉండనున్నాయి. కేబిన్ మరింత స్పేషియస్గా మారనుంది. సరికొత్త టెక్నాలజీ ఇందులో ఉంటుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం.. ఈ క్రేటా ఈవీపై సమాచారం లేదు. రానున్న రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మారుతీ సుజుకీ ఈవీఎక్స్..
Maruti Suzuki EVX electric suv : మారుతీ సుజుకీ సంస్థ నుంచి వస్త్తున్న తొలి ఎలక్ట్రిక్ వెహికిల్పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే.. ఈవీఎక్స్ ఎస్యూవీని సిద్ధం చేస్తోంది సంస్థ. 2024 తొలినాళ్లల్లో.. ప్రొడక్షన్ని మొదలుపెట్టనున్నట్టు ఇటీవలే ప్రకటించింది. లాంచ్ కూడా వచ్చే ఏడాదిలోనే ఉండొచ్చు. ఈ ఈవీలో 60కేడబ్ల్యూహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 550 కి.మీల దూరం ప్రయాణించవచ్చని సంస్థ వెల్లడించింది.
టాటా కర్వ్ ఈవీ..
టాటా కర్వ్ ఈవీని.. 2023 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది టాటా మోటార్స్. డిజైన్ పరంగా అత్యంత స్టైలిష్గా కనిపిస్తోంది. టెక్నికల్ వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. 2024లో దీనిని భారతీయుల ముందుకు తీసుకొస్తుంది సంస్థ.
టాటా పంచ్ ఈవీ..
Tata Punch EV launch : టాటా పంచ్ ఈవీ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే.. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్ అయిపోయి ఉండాలి. కానీ.. ఇంకా లాంచ్ అవ్వలేదు. కాగా.. డిసెంబర్ 21న ఈ మోడల్ని సంస్థ రివీల్ చేస్తుందని తెలుస్తోంది. 2024 సేల్స్ మొదలవుతాయట. టాటా మోటార్స్కు బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీల్లో ఒకటి టాటా పంచ్. దీని ఈవీ వర్షెన్ కూడా క్లిక్ అవుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
మహీంద్రా అండ్ మహీంద్రా..
మహీంద్రా సంస్థకు ప్రస్తుతం ఒక్కటే ఎలక్ట్రిక్ వెహికిల్ ఉంది. అది మహీంద్రా ఎక్స్యూవీ400. వచ్చే ఏడాదిలో రెండు ఈవీలు లాంచ్ అవ్వొచ్చు. అవి మహీంద్రా ఎక్స్యూవీ.ఈ8, మహీంద్రా ఎక్స్యూవీ బీఈ.05. వీటిల్లో 80 కేడబ్ల్యూహెచ్, 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ ఎక్స్యూవీ.ఈ8 అనేది మహీంద్రా ఎక్స్యూవీ700కి ఎలక్ట్రిక్ వర్షెన్ అని తెలుస్తోంది. పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
వీటితో పాటు మరిన్ని ఎలక్ట్రిక్ వెహికిల్స్ కూడా ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోకి రానున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తాము. అప్డేట్స్ కోసం హెచ్టీ తెలుగును ఫాలో అవ్వడం మర్చిపోకండి.
సంబంధిత కథనం