LIC bonus and dividend : ఎల్ఐసీ షేర్హోల్డర్లకు భారీగా డివిడెండ్లు.. బోనస్ షేర్లు!
LIC bonus shares and dividend : షేర్హోల్డర్లకు బోనస్ షేర్లు, భారీ మొత్తంలో డివిడెండ్లు ఇచ్చేందుకు ఎల్ఐసీ, కేంద్రం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చర్యలతో ఎల్ఐసీ స్టాక్ ధర పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
LIC bonus shares and dividend : ఐపీఓ నాటి నుంచి షేర్హోల్డర్లకు చేదు అనుభవాన్నే ఇస్తోంది ఎల్ఐసీ(లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా). 5 నెలలుగా ఎల్ఐసీ షేర్లు పడుతూనే ఉన్నాయి. ఫలితంగా మదుపర్లలో ఎల్ఐసీ స్టాక్పై ఆసక్తి తగ్గింది! ఇక ఇప్పుడు.. మదుపర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బోనస్ షేర్లు, భారీగా డివిడెండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
స్టాక్ పతనం..
ఈ ఏడాది మేలో.. ప్రభుత్వ ఆధారిత ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. భారీ అంచనాలతో అడుగుపెట్టిన ఎల్ఐసీ ఐపీఓ డీలా పడింది. రూ. 949ను అలాట్మెంట్ ప్రైజ్గా నిర్దేశించగా.. తొలిరోజు 8శాతం నష్టాల వద్ద ఓపెన్ అయ్యింది. అప్పటికే మదుపర్లు నష్టపోయారు. ఇక ఇప్పుడు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి ఎల్ఐసీ షేరు రూ. 592.65 వద్ద స్థిరపడింది. సంస్థ మార్కెట్ క్యాపిటల్.. ఒకప్పుడు రూ. 6లక్షల కోట్లుగా ఉండగా.. ఇప్పుడు రూ. 3.75లక్షల కోట్లకు పడిపోయింది.
LIC share price : ఈ క్రమంలో షేరు ధరను ప్రభావితం చేసే విధంగా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్ఐసీ ఎన్పీఎఫ్(నాన్ పార్టిసిపేటింగ్ ఫండ్)లో రూ. 11.57ట్రిలియన్లు ఉన్నాయి. వాటిల్లో నుంచి రూ. 1.8ట్రిలిన్(21.83బిలియన్ డాలర్లు)ను తీసి షేర్హోల్డర్ ఫండ్కు కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
జీవిత బీమా సంస్థలు.. సాధారణంగా రెండు రకాల ప్రాడక్టులను అమ్ముతుంటాయి. ఒకటి.. పార్టిసిపెంటింగ్ పాలసీ. ఇందులో లాభాలను కస్టమర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది.. నాన్ పార్టిసిపేటింగ్ పాలసీ. ఇందులో ఫిక్స్డ్ రిటర్నులు ఉంటాయి. ఇందులో వచ్చే ప్రీమియంను నాన్ పార్టిసిపేటింగ్ ఫండ్లో వేస్తుంది ఎల్ఐసీ. సంస్థ బోర్డు ఆమోదంతో.. ఈ నగదును షేర్హోల్డర్లకు డివిడెండ్ల రూపంలో అందివొచ్చు.
ఇలా.. ఫండ్స్ను షేర్హోల్డర్లకు పంచితే.. మదుపర్లలో నమ్మకం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో కూడా డివిడెండ్లు భారీగా పెరుగుతాయన్న విశ్వాసం మదుపర్లలో ఉంటుందని, అందువల్ల ఎల్ఐసీ షేర్లను కొనుగోలు చేస్తారని ధీమాగా ఉన్నట్టు పేర్కొన్నాయి.
బోనస్ షేర్లు, డివిడెండ్లు.. ఈ రెండింట్లో ఏదో ఒకటే జరగవచ్చని తెలుస్తోంది.
కాగా.. ఈ వార్తలపై ఎల్ఐసీ, కేంద్ర ఆర్థిక శాఖ ఇంకా స్పందించలేదు. కాగా.. మదుపర్లను ఆకర్షించడంపై ఇటీవలే ఎల్ఐసీకి మార్గదర్శకాలు ఇచ్చింది ప్రభుత్వం. సంస్థను లాభాల బాట పట్టించే దిశగా వ్యూహాలను మార్చాలని సంస్థ యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది.
LIC share price target : ఎల్ఐసీకి 7 బ్రోకరేజీ సంస్థలు 'బై' రేటింగ్ ఇచ్చాయి. టార్గెట్ ప్రైజ్ని రూ. 840గా పేర్కొన్నాయి.
సంబంధిత కథనం