ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తలతో నష్టాల్లో సూచీలు.. అత్యధికంగా లాభపడిన, నష్టపోయిన షేర్లు ఇవే-know why stock market down today key factors behind nifty below 25000 and sensex falls 511 points ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తలతో నష్టాల్లో సూచీలు.. అత్యధికంగా లాభపడిన, నష్టపోయిన షేర్లు ఇవే

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తలతో నష్టాల్లో సూచీలు.. అత్యధికంగా లాభపడిన, నష్టపోయిన షేర్లు ఇవే

Anand Sai HT Telugu

స్టాక్ మార్కెట్ సోమవారం క్షీణతను చూసింది. సెన్సెక్స్ 511 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కూడా ఇందుకు కారణంగా ఉన్నాయి.

స్టాక్​ మార్కెట్​

రాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యలోకి అమెరికా కూడా వచ్చింది. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. దీంతో ప్రపంచ మార్కెట్లపై దీని ప్రభావం పడింది. భారత మార్కెట్లు కూడా సోమవారం క్షీణతను చూశాయి. మరోవైపు చమురు ధరల భయం కూడా వెంటాడింది. ఐటీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు మాత్రం నిలబడ్డాయి.

సోమవారం స్టాక్ మార్కెట్ క్షీణతను చూసింది. సెన్సెక్స్ 511 పాయింట్లు క్షీణించగా. నిఫ్టీ 50 సోమవారం 24,971 వద్ద ముగిసింది. టెక్నాలజీ, ఆటో స్టాక్‌లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో నిఫ్టీ 50 సూచీ కీలకమైన 25,000 స్థాయి కంటే దిగువకు పడిపోయింది.

సోమవారం సెన్సెక్స్ 81,704 వద్ద ప్రారంభమై 0.62 శాతం క్షీణతతో రోజు చివరిలో 81,896 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం 24,939 వద్ద ప్రారంభమై 0.56 శాతం క్షీణతతో 24,971 వద్ద ముగిసింది.

ఈ క్షీణత ఉన్నప్పటికీ, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు బాగా రాణించాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.20 శాతం పెరుగుదలను, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.57 శాతం పెరుగుదలను చూసింది. ఈ కాలంలో బీఎస్ఈలో జాబితా చేసిన కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు రూ.448 లక్షల కోట్లుగా ఉంది. దీనికి క్రెడిట్ మిడ్, స్మాల్ క్యాప్ విభాగాలలో పెరుగుదలకు చెందుతుంది.

లాభపడిన షేర్లు

నిఫ్టీ 50లో టాప్ గెయినర్ల గురించి మాట్లాడుకుంటే, ట్రెంట్ షేరు 3.78 శాతం పెరుగుదలతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత, భారత్ ఎలక్ట్రానిక్స్ 3.1 శాతం, హిందాల్కో 1.89 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.17 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 0.97 శాతం పెరుగుదలతో అగ్రస్థానంలో ఉన్నాయి.

నష్టపోయిన షేర్లు

మరోవైపు నిఫ్టీ 50లో టాప్ లూజర్లను పరిశీలిస్తే, ఇన్ఫోసిస్ అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. ఇది 2.4 శాతం తగ్గింది. దీని తర్వాత, ఎల్‌అండ్‌టీ 2.14 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.11 శాతం, హీరో మోటోకార్ప్ 1.97 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.56 శాతం తగ్గాయి.

రంగాలవారీగా

రంగాలవారీ సూచీలలో నిఫ్టీ మీడియా అత్యధికంగా 4.39 శాతం లాభపడింది. ఆ తర్వాత నిఫ్టీ ఇండియా డిఫెన్స్ 2.14 శాతం, నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ 1.94 శాతం, నిఫ్టీ మెటల్ 0.66 శాతం, నిఫ్టీ ఇండియా టూరిజం 0.47 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ ఐటీ అత్యధికంగా 1.48 శాతం నష్టపోయింది. దీని తర్వాత, నిఫ్టీ ఆటో 0.92 శాతం, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 0.74 శాతం, నిఫ్టీ సర్వీసెస్ సెక్టార్ 0.60 శాతం నష్టపోయాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.