ఈ పవర్‌ఫుల్ బైక్ పొందడానికి గోల్డెన్ ఛాన్స్.. రూ.40,000 వరకు డిస్కౌంట్!-kawasaki z900 gets huge discount know the offers and bike details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ పవర్‌ఫుల్ బైక్ పొందడానికి గోల్డెన్ ఛాన్స్.. రూ.40,000 వరకు డిస్కౌంట్!

ఈ పవర్‌ఫుల్ బైక్ పొందడానికి గోల్డెన్ ఛాన్స్.. రూ.40,000 వరకు డిస్కౌంట్!

Anand Sai HT Telugu

కవాసాకి జెడ్ 900 కొనుగోలు చేయడానికి కస్టమర్లకు సువర్ణావకాశం ఉంది. దీనిపై కంపెనీ రూ.40,000 భారీ డిస్కౌంట్ వోచర్ అందిస్తోంది. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ప్రతీకాత్మక చిత్రం

మీరు మంచి క్రేజీ స్పోర్ట్స్ బైక్ కొనాలని కలలు కంటుంటే ఇది మీకు సరైన అవకాశం. ఎందుకంటే కవాసాకి తన పాపులర్ సూపర్ బైక్ జెడ్900పై ఏప్రిల్ 2025లో 40,000 డిస్కౌంట్ ఆఫర్‌ను కొనసాగించింది. ఇది బైక్ ప్రియులకు పెద్ద గిఫ్ట్ లాంటిది అన్నమాట. మీరు ఈ బైక్ పొందాలనుకుంటే సమీప డీలర్‌షిప్‌ వెళ్లి వెంటనే బుక్ చేసుకోండి.

ఈ ఆఫర్ ప్రత్యేకత ఏంటి?

కవాసాకి జెడ్900 ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.9.38 లక్షలు. అయితే ఈ డిస్కౌంట్ తర్వాత బైక్ ధర రూ.8.98 లక్షలకు దిగొచ్చింది. ఈ ఆఫర్ 31 మే 2025 వరకు లేదా స్టాక్ అయిపోయే వరకు వర్తిస్తుంది.

జెడ్ 900 ఎందుకు ప్రత్యేకం?

జెడ్ 900 భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, సరసమైన ఇన్లైన్-ఫోర్ నేకెడ్ సూపర్ బైక్లలో ఒకటి. మొదటిసారి పెద్ద ఇంజిన్ స్పోర్ట్స్ బైక్ కొనాలనుకునే రైడర్లలో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఈ బైక్ బలమైన ఇంజిన్, అద్భుతమైన పనితీరును కలిగి ఉంది. ఇందులోని 948 సిసి ఇన్ లైన్-4 సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 123.6బిహెచ్ పి పవర్, 98.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.

ఫీచర్లు

ఇందులో ఉన్న హైటెక్ ఫీచర్ల విషయానికొస్తే ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్, టీఎఫ్టీ డిస్‌ప్లే, ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ఉన్నాయి. జెడ్ 900 స్మూత్ రైడింగ్, హీట్ మేనేజ్మెంట్, ట్రాఫిక్లో మెరుగైన నియంత్రణకు ప్రసిద్ది చెందింది. ఈ బైక్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ వంటి బైకులకు గట్టి పోటీ ఇస్తుంది.

2025 కవాసాకి జెడ్ 900 త్వరలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే కవాసాకి తన ప్రస్తుత స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఈ డిస్కౌంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటోంది. మీరు హై-పవర్, స్టైలిష్ స్పోర్ట్స్ బైక్ కావాలనుకుంటే కవాసాకి జెడ్ 900ను కొనుగోలు చేయెుచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.