వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ సంస్థ తమ జాయ్ ఇ-బైక్ బ్రాండ్ కింద తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణిలో ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జాయ్ ఇ-బైక్ బ్రాండ్ కింద ఉన్న వోల్ఫ్ 31ఏహెచ్, జెన్ నెక్ట్స్ 31ఏహెచ్, నాను ప్లస్, వోల్ఫ్ ప్లస్, నానో ఎకో, వోల్ఫ్ ఎకో సహా ఎంపిక చేసిన జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్ లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. అన్ని మోడళ్ల ధరలను ఫ్లాట్ గా తగ్గించింది.
ఈ డిస్కౌంట్ తో తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన శ్రేణి సేల్స్ పెంచాలని, మార్కెట్ ఉనికిని బలోపేతం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ప్రకటించిన డిస్కౌంట్ లు కూడా తక్కువ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపైననే కావడం గమనార్హం. ఈ డిస్కౌంట్ మిహోస్, నెమో వంటి హైస్పీడ్ స్కూటర్లకు వర్తించదు.
జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్లలోని లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. ఇది విస్తృత శ్రేణి వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ-స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. జాయ్ ఇ-బైక్ ప్రస్తుతం మార్కెట్లో 10కి పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను హై-స్పీడ్ మరియు లో-స్పీడ్ కేటగిరీల్లో విక్రయిస్తోంది. ఈ సంస్థ భారతదేశం అంతటా 400 కి పైగా నగరాలలో ఉంది. రాబోయే సంవత్సరాలలో మరన్ని నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సంబంధిత కథనం