భారీగా తగ్గిన ‘జాయ్’ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర; లైసెన్స్ కూడా అవసరం లేదు; సిటీ ట్రావెల్ కు బెస్ట్-joy e bike low speed electric scooters get a price drop of 13 thousand rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  భారీగా తగ్గిన ‘జాయ్’ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర; లైసెన్స్ కూడా అవసరం లేదు; సిటీ ట్రావెల్ కు బెస్ట్

భారీగా తగ్గిన ‘జాయ్’ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర; లైసెన్స్ కూడా అవసరం లేదు; సిటీ ట్రావెల్ కు బెస్ట్

Sudarshan V HT Telugu

ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ‘వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ’ తన జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ బ్రాండ్ కింద వోల్ఫ్ 31ఏహెచ్, జెన్ నెక్ట్స్ 31ఏహెచ్, నాను ప్లస్, వోల్ఫ్ ప్లస్, నానో ఎకో, వోల్ఫ్ ఎకో వంటి జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఉన్నాయి.

‘జాయ్’ ఎలక్ట్రిక్ స్కూటర్ల పై డిస్కౌంట్

వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ సంస్థ తమ జాయ్ ఇ-బైక్ బ్రాండ్ కింద తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణిలో ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జాయ్ ఇ-బైక్ బ్రాండ్ కింద ఉన్న వోల్ఫ్ 31ఏహెచ్, జెన్ నెక్ట్స్ 31ఏహెచ్, నాను ప్లస్, వోల్ఫ్ ప్లస్, నానో ఎకో, వోల్ఫ్ ఎకో సహా ఎంపిక చేసిన జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్ లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. అన్ని మోడళ్ల ధరలను ఫ్లాట్ గా తగ్గించింది.

జాయ్ ఇ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ధర తగ్గింపు

ఈ డిస్కౌంట్ తో తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన శ్రేణి సేల్స్ పెంచాలని, మార్కెట్ ఉనికిని బలోపేతం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ప్రకటించిన డిస్కౌంట్ లు కూడా తక్కువ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపైననే కావడం గమనార్హం. ఈ డిస్కౌంట్ మిహోస్, నెమో వంటి హైస్పీడ్ స్కూటర్లకు వర్తించదు.

గంటకు 25 కిలోమీటర్లు

జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్లలోని లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. ఇది విస్తృత శ్రేణి వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ-స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. జాయ్ ఇ-బైక్ ప్రస్తుతం మార్కెట్లో 10కి పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను హై-స్పీడ్ మరియు లో-స్పీడ్ కేటగిరీల్లో విక్రయిస్తోంది. ఈ సంస్థ భారతదేశం అంతటా 400 కి పైగా నగరాలలో ఉంది. రాబోయే సంవత్సరాలలో మరన్ని నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం