2023-24 ఆర్థిక సంవత్సరానికి మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) దాఖలు చేశారా? ఇంకా చేయకపోతే జూలై 31 తో గడువు ముగుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఐటీఆర్ ఫైలింగ్ చుట్టూ అనేక సందేహాలు ఉంటాయి. ఫామ్ 16 లేకపోతే ఐటీఆర్ని ఫైల్ చేయలేమా? అన్న ప్రశ్న తరచూ అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాము..
మీ వద్ద ఫామ్ 16 లేకపోయినా కంగారు పడకండి! ఇతర సంబంధిత డాక్యుమెంట్లలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి మీరు రిటర్న్ దాఖలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈడాక్యుమెంట్లలో బ్యాంక్ స్టేట్మెంట్లు, శాలరీ స్లిప్పులు, ఇంట్రెస్ట్ సర్టిఫికేట్లు, ఇతర ఆదాయ సంబంధిత పత్రాలు ఉంటాయి.
పన్ను చెల్లింపుదారుడికి అనేక ఆదాయ వనరులు ఉండవచ్చని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఈ వనరులలో సాధారణంగా ఈ క్రిందివి ఉంటాయి:
ఏ. జీతం: వేతన స్లిప్పుల సహాయంతో వేతన ఆదాయాన్ని నిర్ధారించవచ్చు.
బీ. వడ్డీ ఆదాయం: మీరు మీ పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) ఖాతాలు, ఇతర పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని జోడించవచ్చు.
సీ. ఇంటి అద్దె: మీ అద్దె ఆస్తి నుంచి వచ్చే ఆదాయం మీ మొత్తం ఆదాయానికి జోడించాల్సిన అద్దె ఆదాయం.
డీ. ఇతర వనరులు: ఫ్రీలాన్స్ వర్క్ ద్వారా సంపాదించడం వంటి ఇతర ఆదాయాలు ఇంకా ఉండవచ్చు.
"సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్కి ఫామ్ 16 అవసరం. కానీ మీ వద్ద అది లేకపోతే, మీరు శాలరీ స్లిప్పులపై ఆధారపడవచ్చు," అని ముంబైకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ చిరాగ్ చౌహాన్ చెప్పారు.
"ఒకవేళ యజమాని టీడీఎస్ (ట్యాక్స్ డిడక్ట్ ఎట్ సోర్స్)ను మినహాయించినట్లయితే, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఫామ్ 16 జారీ చేయాల్సి ఉంటుంది. కానీ మీ జీతం పన్ను పరిధిలోకి రానందున యజమాని టీడీఎస్ మినహాయించకపోతే, అందువల్ల ఫామ్ 16 జారీ చేయకపోతే? ఫామ్ 16 లేకపోవడం వల్ల మీరు ఐటీఆర్ దాఖలు చేయలేరని కాదు. ఈ సందర్భంలో, మీరు మీ జీతం స్లిప్పులు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఫామ్ 26 ఎఎస్, వార్షిక సమాచార ప్రకటన వంటి పత్రాలను ఉపయోగించి ఐటిఆర్ దాఖలు చేయాలి. ఇతర పద్దుల కింద పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం కోసం అద్దె, వడ్డీ రసీదులను కూడా మీరు తనిఖీ చేయాలి" అని దిల్లీకి చెందిన సంస్థ పిడి గుప్తా అండ్ కంపెనీ భాగస్వామి చార్టర్డ్ అకౌంటెంట్ ప్రతిభా గోయల్ చెప్పారు.
"ఫామ్ 16లో వేతన చెల్లింపుదారుడి పన్ను బాధ్యతకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుంది. కానీ డాక్యుమెంట్ లేకపోతే ఫామ్ 26ఏఎస్పై ఆధారపడవచ్చు," అని దిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ దీపక్ అగర్వాల్ చెప్పారు.
సంబంధిత కథనం