ఇంటెల్ కార్ప్ ఈ వారంలో 20 శాతానికి పైగా సిబ్బందిని తగ్గించే ప్రణాళికలను ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. అనవసర ఖర్చులను తగ్గించే లక్ష్యంతో, నిర్వహణను క్రమబద్ధీకరించడానికి, ఇంజనీరింగ్ ఆధారిత సంస్కృతిని పునర్నిర్మించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ లే ఆఫ్ ప్రణాళికల గురించి ఇంటెల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
గత నెలలో బాధ్యతలు స్వీకరించిన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లిప్-బు టాన్ ఆధ్వర్యంలో ఈ లేఆఫ్ ప్రణాళిక మొదటి అతి పెద్ద పునర్నిర్మాణం. అనుభవజ్ఞుడైన టాన్, తన మిషన్ కు ఉపయోగపడని ఇంటెల్ ఆస్తులను తొలగించి మరింత ఆకర్షణీయమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇంటెల్ గత ఏడాది సుమారు 15,000 ఉద్యోగాలను తొలగించింది. 2024 చివరి నాటికి ఇంటెల్ 108,900 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అంతకుముందు సంవత్సరం ఉద్యోగుల సంఖ్య 124,800 గా ఉంది. కాగా, తాజా లే ఆఫ్ ల గురించి స్పందించేందుకు ఇంటెల్ ప్రతినిధి నిరాకరించారు.
బుధవారం న్యూయార్క్ ఎక్స్ఛేంజీలు తెరవడానికి ముందు ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో ఇంటెల్ షేర్లు 3.5% పెరిగాయి. గత 12 నెలల్లో ఈ షేరు 43 శాతం క్షీణించి మంగళవారం 19.51 డాలర్ల వద్ద ముగిసింది. ప్రత్యర్థి చిప్ మేకర్స్ తో పోలిస్తే ఇంటెల్ కొన్నేళ్లుగా వెనుకబడి ఉంది. ముఖ్యంగా కృత్రిమ మేధ కంప్యూటింగ్ లో ఎన్ విడియా కార్ప్ తో పోటీ పడలేకపోయింది. దాంతో, గత మూడేళ్లుగా అమ్మకాల్లో తగ్గుదలను నమోదు చేసింది. ఇప్పుడు మళ్లీ ఐకానిక్ చిప్ మేకర్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంటెల్ కోసం తన స్వంత టర్న్అరౌండ్ బిడ్ ను అమలు చేయడానికి కష్టపడిన సిఇఒ పాట్ గెల్సింగర్ ను గత సంవత్సరం తొలగించారు. ఇప్పుడు 65 ఏళ్ల ఎలిప్-బు టాన్ ను సీఈఓ గా నియమించారు. అతను కంపెనీ నెట్ వర్క్ ను విస్తరించడానికి భారీ ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఇంటెల్ ను మేడ్-టు-ఆర్డర్ చిప్ తయారీదారుగా మార్చడానికి ప్రయత్నించాడు.
సంబంధిత కథనం