Tariff hike : షాకింగ్.. రీఛార్జ్ ప్లాన్స్ ధరల పెంపుతో భారతీయులపై ఏడాదికి రూ. 47,500 కోట్ల భారం!
Airtel tariff hike : రిఛార్జ్ ధరల పెంపు వల్ల భారతీయులపై ఎంత భారం పడుతుంది? అన్న విషయంపై ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ వివరాలు..

Jio Tariff hike : రీఛార్జ్ ధరలను పెంచి భారతీయ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చాయి ప్రముఖ టెలికాం సంస్థలు. ఈ పరిణామాలతో భారతీయులపై రూ. 47,500 కోట్ల అధిక భారం పడనుందని ఓ నివేదిక వెల్లడించింది.
భారతీయులపై రూ. 47,500 కోట్ల భారం!
కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ నోట్ ప్రకారం.. పెరిగిన టారీఫ్లతో భారతీయులపై వార్షికంగా రూ. 47,500 కోట్ల అదనపు భారం పడుతుంది. కానీ.. ఇది టెలికాం సంస్థలకు మంచి విషయం! ఇంతకాలం ఇస్తున్న 5జీ సర్వీస్ని మానిటైజ్ చేసుకునేందుకు, 2016 నుంచి టెలికాం రంగంలో కనిపిస్తున్న తీవ్రమైన ప్రైజ్ వార్కి ఇది చెక్ పెడుతుంది.
రిలయన్స్ జియో తమ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను 13శాతం నుంచి 27శాతం వరకు పెంచింది. భారతీ ఎయిర్టెల్.. 10శాతం నుంచి 21శాతం వరకు ప్రైజ్ హైక్ తీసుకుంది. వొడాఫోన్ ఐడియా.. 10శాతం నుంచి 23శాతం వరకు తమ ప్లాన్స్ని పెంచుకుంది. ఇదంతా రెండు రోజుల వ్యవధిలోనే జరిగిది!
5జీ ప్లాన్ కావాలనుకునే జియో కస్టమర్.. ఇప్పటివరకు రూ. 239 (రోజుకు 1.5జీబీ డేటా) చెల్లించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు.. అది రూ. 349 (రోజుకు 2జీబీ డేటా)కి చేరింది.
ఈ విషయంలో జియో కన్నా ఎయిర్టెల్ మరింత ప్రైజ్ హైక్ తీసుకుంది! 5జీ కావాలంటే.. ఇప్పటివరకు రూ. 239 (రోజుకు 1.5జీబీ డేటా) చెల్లించాల్సి వస్తే.. ఇప్పుడది రూ. 409 (రోజుకు 2.5జీబీ)కి చేరింది.
ఇండియాలో టారీఫ్ ప్రైజ్ వార్ని మొదలుపెట్టింది రిలయన్స్ జీయోనే! ఎక్కువ సబ్స్క్రైబర్స్ కోసం ఆ సంస్థ తక్కువ ధరలకే సేవలను అందించింది. ఫలితంగా.. ఇతర టెలికాం సంస్థలు, కస్టమర్లను కోల్పోతాము అన్న భయంతో ఈ ప్రైజ్ వార్లోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు.. ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
ఎయిర్టెల్ కొత్త ప్లాన్స్..
2జీబీ డేటా, అన్లిమెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో 28 రోజుల వాలిడిటీ ఉండే ఎంట్రీ లెవల్ రూ. 179 ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్.. రూ. 199 అయ్యింది. 6జీబీ డేటాతో 84 రోజుల పాటు వచ్చే రూ. 455 ప్లాన్, ఇప్పుడు రూ. 509 అయ్యింది. ఇక 24జీబీ డేటాతో 365 రోజుల వాలిడిటీతో వచ్చే రూ. 1799 ప్లాన్.. రూ. 1999 అయ్యింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జియో కొత్త ప్లాన్స్ ఇలా..
ఎంట్రీ-లెవల్ నెలవారీ ప్లాన్ గతంలో 28 రోజుల పాటు 2 GB డేటా కోసం రూ. 155 ధరలో ఉండేది. ఇప్పుడు ఆ ప్లాన్ ధర రూ. 189 చేరింది. 28 రోజుల వ్యవధిలో రోజుకు 1 GB ప్లాన్ని ఎంచుకునేందుకు రూ. 209 నుంచి రూ. రూ. 249 చెల్లించాల్సి ఉంది. రోజుకు 1.5 GB ప్లాన్ ధర రూ. 239 నుంచి రూ. 299కు పెరిగింది. రోజుకు 2 GB ప్లాన్ ఇప్పుడు రూ. 299 నుంచి రూ. 349కి పెరిగింది. అధిక డేటా వినియోగం కోసం రోజుకు 2.5 GB ప్లాన్ రూ. 349 నుంచి రూ. 399కి పెంచింది. రోజుకు 3 GB ప్లాన్ ను రూ. 399 నుంచి రూ. 449కి పెంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం