భారత్- పాకిస్థాన్ కాల్పుల విరమణ, అమెరికా- చైనా వాణిజ్య యుద్ధాని బ్రేక్ పడటం వంటి అత్యంత సానుకూల పరిణామాల మధ్య దేశీయ సూచీలు సోమవారం ట్రేడింగ్ సెషన్ని అతి భారీ లాభాలతో ముగించాయి. బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ50.. దాదాపు 4శాతం మేర లాభపడ్డాయి. ఇండెక్స్లు ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఈ స్థాయిలో లాభాలను చూడటం 4ఏళ్లల్లో ఇదే తొలిసారి! అంతేకాదు, తాజా బుల్ రన్తో సోమవారం ఒక్కరోజే బీఎస్ఈ సెన్సెక్స్ కంపెనీల మార్కెట్ క్యాపిటల్ దాదాపు రూ. 16లక్షల కోట్లు పెరిగింది.
బీఎస్ఈ సెన్సెక్స్ 2,975 పాయింట్లు (3.74 శాతం) పెరిగి 82,430 వద్ద స్థిరపడింది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అయిన 85,978 నుంచి 4 శాతం దూరంలో, ఈ రోజు 82,495.97 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 916.70 పాయింట్లు (3.82%) పెరిగి 24,944.80 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇదిలా ఉండగా, బీఎస్ఈలో లిస్టయిన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,6,06,576 లక్షల కోట్లు పెరిగి రూ.4,4,4,42,42,700 కోట్లకు చేరుకుంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి ఈ సంఖ్య రూ.4,16,40,850.46గా ఉంది.
ప్రధాన సూచీలే కాదు, బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్లు కూడా దుమ్మురేపాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.85 శాతం పెరిగి 43,731.60 వద్ద స్థిరపడగా, బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 4.18 శాతం పెరిగి 48,693.75 వద్ద ముగిసింది.