ఫ్రీ కదా అని పబ్లిక్ వైఫై ఇష్టమున్నట్టు వాడుతున్నారా? ప్రభుత్వం గట్టి వార్నింగ్!-indian govt warns against making this big mistake on public wi fi check in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఫ్రీ కదా అని పబ్లిక్ వైఫై ఇష్టమున్నట్టు వాడుతున్నారా? ప్రభుత్వం గట్టి వార్నింగ్!

ఫ్రీ కదా అని పబ్లిక్ వైఫై ఇష్టమున్నట్టు వాడుతున్నారా? ప్రభుత్వం గట్టి వార్నింగ్!

Anand Sai HT Telugu

ఉచిత వై-ఫై అంటే అందరికీ ఇష్టమే. అయితే ప్రజలు తమ వ్యక్తిగత డేటాను కాపాడుకోవడానికి ఆర్థిక లావాదేవీలు వంటి సున్నితమైన ప్రయోజనాల కోసం ఈ నెట్‌వర్క్‌లను ఉపయోగించవద్దని ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది.

govt warns against using free public wifi for financial transactions

చిత వై-ఫై ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు జనాలు. ముఖ్యంగా విమానాశ్రయం, కాఫీ షాప్ లేదా బహిరంగ ప్రదేశంలో అందుబాటులో ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వడానికి ఇది సులభమైన మార్గం. పబ్లిక్ వై-ఫై ఉపయోగించడం వల్ల మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ప్రమాదంలో పడుతుంది. ప్రజలు తమ వ్యక్తిగత డేటాను రక్షించుకోవడానికి ఆర్థిక లావాదేవీలు వంటి సున్నితమైన ప్రయోజనాల కోసం ఈ నెట్‌వర్క్‌లను ఉపయోగించవద్దని ప్రభుత్వం కఠినమైన హెచ్చరిక జారీ చేసింది.

పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లకు సరైన భద్రత ఉండదు. ఇవి హ్యాకర్లు, స్కామర్లకు సులభమైన లక్ష్యాలుగా మారతాయి. డిజిటల్ భద్రతపై అవగాహన పెంచేందుకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) 'అవేర్నెస్ డే' కార్యక్రమం కింద కొత్త రిమైండర్‌ను విడుదల చేసింది.

లావాదేవీలు చేయెుద్దు

పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లలో బ్యాంకింగ్ లేదా ఆన్లైన్ షాపింగ్ వంటి సున్నితమైన కార్యకలాపాలు చేయడంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. సైబర్ నేరగాళ్లు పబ్లిక్ వై-ఫై ద్వారా అన్ సెక్యూర్డ్ కనెక్షన్లను సులభంగా అడ్డుకోగలరని, దీనివల్ల డేటా చోరీ, ఆర్థిక నష్టం, మోసాలకు కూడా గురయ్యే ప్రమాదం ఉందని సూచించింది. ఇలాంటి నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయినప్పుడు లావాదేవీలు జరపడం లేదా వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయడం మానుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది.

పాస్‌వర్డ్‌లు జాగ్రత్త

సీఈఆర్టీ-ఇన్ కొన్ని ముఖ్యమైన భద్రతా చిట్కాలను కూడా పంచుకుంది. లింక్స్, అటాచ్‌మెంట్లపై క్లిక్ చేయవద్దని, అన్ని ఆన్లైన్ ఖాతాలకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలని తెలిపింది. ముఖ్యమైన ఫైళ్లను డ్రైవ్స్‌లో విడిగా బ్యాకప్ చేయాలి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయని పేర్కొంది. ఇమెయిల్స్ చెక్ చేయడం లేదా పబ్లిక్ వై-ఫై ద్వారా సోషల్ మీడియా ఖాతాలలోకి లాగిన్ కావడం వంటివి కూడా ప్రమాదకరమని చెప్పింది.

సీఈఆర్టీ-ఇన్ గురించి

భారతదేశంలో ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీకి బాధ్యత వహించే జాతీయ సంస్థ సెర్ట్-ఇన్. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం సైబర్ సెక్యూరిటీ ఘటనలపై స్పందించేందుకు సీఈఆర్టీ-ఇన్ జాతీయ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సైబర్ ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, పంచుకోవడం, అత్యవసర చర్యలు అందించడం దీని పాత్ర.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.