పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతర పరిస్థితులతో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికి తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గరవుతున్నారు. అయితే, ప్రజలకు రియల్-టైమ్ అలర్ట్స్ని ఇచ్చేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు కృషిచేస్తోంది. స్మార్ట్ఫోన్స్లో కూడా అలర్ట్స్ని ఇస్తోంది. వాటిని చూసి మనం వెంటనే స్పందించి, మన రక్షణని చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్తో పాటు ఐఫోన్స్లకు ప్రభుత్వం నుంచి అలర్ట్స్ పొందే మెకానిజం ఉంది. ఈ హెచ్చరికలు డైరెక్ట్గా మీ మొబైల్లోకి వస్తాయి. వీటిల్లో ఎమర్జెన్సీ కంటెంట్ ఉంటుంది. అయితే కొన్ని డివైజ్లలో ఎమర్జెన్సీ అలర్ట్స్ డిసేబుల్ చేసి ఉంటాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో వీటిని ఎనేబుల్ చేసుకోవడం చాలా అవసరం. అందుకే, ఆండ్రాయిడ్, ఐఫోన్స్లో ఎమర్జెన్సీ అలర్ట్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
స్టెప్ 1- మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
స్టెప్ 2- సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ మీద క్లిక్ చేయండి. అది కనిపించకపోతే, ఎమర్జెన్సీ అలర్ట్స్ అనే ఆప్షన్ కోసం వెతకండి.
స్టెప్ 3- వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4- ఉన్న అన్ని అలర్ట్ ఆప్షన్స్ని యాక్టివేట్ చేయండి.
అయితే ఈ ప్రాసెస్లోని పేర్లు ఫోన్కి, ఫోన్కి మారొచ్చు. 'వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్' పేరు మరో విధంగా ఉండచ్చు. పైగా, వీటి సెట్టింగ్స్ వేరే విధంగానూ ఉండొచ్చు. చూసుకుని ఆన్ చేసుకోండి.
స్టెప్ 1- మీ ఐఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 2- కిందకి స్క్రోల్ చేసి గవర్న్మెంట్ అలర్ట్స్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3- ముఖ్యమైన అప్డేట్స్ పొందేందుకు అలర్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
ఇండియా పాకిస్థాన్ ఉద్రిక్తతలు మాత్రమే కాదు, భూకంపం- సునామీ వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ ఇవి మీకు ఉపయోగపడతాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు కీలక అలర్ట్స్ని ఈ రూపంలో ఇస్తూనే ఉంటుంది.
సంబంధిత కథనం