భారత్​- పాకిస్థాన్​ ఉద్రిక్తతలు.. ఫోన్​లో హెచ్చరికల కోసం 'ఎమర్జెన్సీ అలర్ట్స్​'ని ఇలా ఆన్​ చేసుకోండి..-india pakistan tensions see how to enable emergency alerts on android and iphone ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  భారత్​- పాకిస్థాన్​ ఉద్రిక్తతలు.. ఫోన్​లో హెచ్చరికల కోసం 'ఎమర్జెన్సీ అలర్ట్స్​'ని ఇలా ఆన్​ చేసుకోండి..

భారత్​- పాకిస్థాన్​ ఉద్రిక్తతలు.. ఫోన్​లో హెచ్చరికల కోసం 'ఎమర్జెన్సీ అలర్ట్స్​'ని ఇలా ఆన్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

భారత్​- పాకిస్థాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆండ్రాయిడ్​, లేదా స్మార్ట్​ఫోన్​లో ప్రభుత్వం ఇచ్చే హెచ్చరికలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 'ఎమర్జెన్సీ అలర్ట్స్​'ని తెలుసుకునేందుకు ఇలా చేయండి..

ఎమర్జెన్సీ అలర్ట్స్​ని ఇలా యాక్టివేట్​ చేసుకోండి..

పహల్గామ్​ ఉగ్రదాడి, ఆపరేషన్​ సిందూర్​ అనంతర పరిస్థితులతో భారత్​- పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికి తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గరవుతున్నారు. అయితే, ప్రజలకు రియల్​-టైమ్​ అలర్ట్స్​ని ఇచ్చేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు కృషిచేస్తోంది. స్మార్ట్​ఫోన్స్​లో కూడా అలర్ట్స్​ని ఇస్తోంది. వాటిని చూసి మనం వెంటనే స్పందించి, మన రక్షణని చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్​తో పాటు ఐఫోన్స్​లకు ప్రభుత్వం నుంచి అలర్ట్స్​ పొందే మెకానిజం ఉంది. ఈ హెచ్చరికలు డైరెక్ట్​గా మీ మొబైల్​లోకి వస్తాయి. వీటిల్లో ఎమర్జెన్సీ కంటెంట్​ ఉంటుంది. అయితే కొన్ని డివైజ్​లలో ఎమర్జెన్సీ అలర్ట్స్​ డిసేబుల్​ చేసి ఉంటాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో వీటిని ఎనేబుల్​ చేసుకోవడం చాలా అవసరం. అందుకే, ఆండ్రాయిడ్​, ఐఫోన్స్​లో ఎమర్జెన్సీ అలర్ట్స్​ని ఎలా ఎనేబుల్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

ఆండ్రాయిడ్​ యూజర్స్​ ఇలా చేయండి..

స్టెప్​ 1- మీ ఆండ్రాయిడ్​ స్మార్ట్​ఫోన్​లో సెట్టింగ్స్​ ఓపెన్​ చేయండి.

స్టెప్​ 2- సేఫ్టీ అండ్​ ఎమర్జెన్సీ మీద క్లిక్​ చేయండి. అది కనిపించకపోతే, ఎమర్జెన్సీ అలర్ట్స్​ అనే ఆప్షన్​ కోసం వెతకండి.

స్టెప్​ 3- వైర్​లెస్​ ఎమర్జెన్సీ అలర్ట్స్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 4- ఉన్న అన్ని అలర్ట్​ ఆప్షన్స్​ని యాక్టివేట్​ చేయండి.

అయితే ఈ ప్రాసెస్​లోని పేర్లు ఫోన్​కి, ఫోన్​కి మారొచ్చు. 'వైర్​లెస్​ ఎమర్జెన్సీ అలర్ట్స్​' పేరు మరో విధంగా ఉండచ్చు. పైగా, వీటి సెట్టింగ్స్​ వేరే విధంగానూ ఉండొచ్చు. చూసుకుని ఆన్​ చేసుకోండి.

ఐఫోన్​ యూజర్స్​ ఇలా చేయండి..

స్టెప్​ 1- మీ ఐఫోన్​లో సెట్టింగ్స్​ ఓపెన్​ చేయండి. నోటిఫికేషన్స్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 2- కిందకి స్క్రోల్​ చేసి గవర్న్​మెంట్​ అలర్ట్స్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3- ముఖ్యమైన అప్డేట్స్​ పొందేందుకు అలర్ట్స్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

ఇండియా పాకిస్థాన్​ ఉద్రిక్తతలు మాత్రమే కాదు, భూకంపం- సునామీ వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ ఇవి మీకు ఉపయోగపడతాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు కీలక అలర్ట్స్​ని ఈ రూపంలో ఇస్తూనే ఉంటుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం