మీ జీతం రూ.50000 అయితే ఈ బెస్ట్ కార్లు బడ్జెట్‌కు సరిపోతాయి.. తక్కువ ధరలో బెటర్ ఆప్షన్స్!-if your salary is 50000 rupees these best cars perfect for buy super features at middle class budget ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మీ జీతం రూ.50000 అయితే ఈ బెస్ట్ కార్లు బడ్జెట్‌కు సరిపోతాయి.. తక్కువ ధరలో బెటర్ ఆప్షన్స్!

మీ జీతం రూ.50000 అయితే ఈ బెస్ట్ కార్లు బడ్జెట్‌కు సరిపోతాయి.. తక్కువ ధరలో బెటర్ ఆప్షన్స్!

Anand Sai HT Telugu

ప్రస్తుతం కారు అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే జీతాన్ని బట్టి చాలా మంది కారు కొంటుంటారు. మీ జీతం రూ.50000 అయితే ఏ కారు కొంటే అని చూద్దాం. ఈఎంఐ కూడా మీకు సరిపోతుంది.

ప్రతీకాత్మక చిత్రం

ంట్లో సొంత కారు ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ కారు కొనడం చాలా పెద్ద విషయం ఎందుకంటే చిన్న కారు కొనడానికి కూడా లక్షల రూపాయలు కావాలి. ఉద్యోగస్తులకు కారు కొనడం మరింత కష్టం. ఎందుకంటే జీతం నుండి చాలా తక్కువ డబ్బు ఆదా చేసుకుంటారు. ఇంటి ఖర్చులకే చాలా డబ్బు పోతుంది. తర్వాత ఈఎంఐలు. అయితే చాలా మంది లోన్ మీద కారు కొనాలని చూస్తుంటారు. ఈ సమయంలో కూడా మీ బడ్జెట్‌ను మరచిపోకూడదు. మీ బడ్జెట్ ప్రకారం కారును రుణం మీద తీసుకోవాలి.

ఉద్యోగం ఉన్నవారు ఈఎంఐపై సులభంగా కారు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా రూ.50,000 రూపాయల వరకు జీతం ఉన్నవారు ఈ కార్లను ఈఎంఐపై కొంటే సమస్యలు ఎక్కువగా ఉండవు.

మారుతి సుజుకి సెలెరియో

రూ.50,000 వరకు జీతం ఉన్న వ్యక్తి మారుతి సుజుకి సెలెరియో కారును ఈఎంఐ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.64 లక్షలు. ఇతర ఖర్చులతో కలిపి కారు ధర దాదాపు రూ.6.20 లక్షలు అవుతుంది. అటువంటి పరిస్థితిలో రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి కారు కొనవచ్చు.

టాటా టియాగో

రూ.50,000 వరకు జీతం ఉన్న వ్యక్తి టాటా మోటార్స్‌కు చెందిన టాటా టియాగో కారును ఈఎంఐపై సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5 లక్షలు. ఇతర ఖర్చులతో కలిపి కారు ధర దాదాపు రూ.6.50 లక్షలు అవుతుంది. రూ.1 లక్ష డౌన్ పేమెంట్ తర్వాత మీరు ఈ కారును సులభంగా కొనుగోలు చేయవచ్చు.

టాటా పంచ్

టాటా పంచ్ కొనడం గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. ఈ కారు ఆన్ రోడ్ ధర రూ. 10.56 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే దీని కోసం మీరు ప్రతి నెలా ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి రావచ్చు. మీ నెలవారీ ఖర్చుల ప్రకారం మీరు ఈఎంఐని చెక్ చేయవచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.