నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా ఎంజాయ్ చేయాలనుకుంటే జియో, ఎయిర్‌టెల్, వీఐ అందించే ప్లాన్స్-if you want to enjoy netflix for free here are the plans offered by jio airtel and vi ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా ఎంజాయ్ చేయాలనుకుంటే జియో, ఎయిర్‌టెల్, వీఐ అందించే ప్లాన్స్

నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా ఎంజాయ్ చేయాలనుకుంటే జియో, ఎయిర్‌టెల్, వీఐ అందించే ప్లాన్స్

Anand Sai HT Telugu

జియో, ఎయిర్‌టెల్, వీఐలు రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఇస్తున్నాయి. ఆ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం..

ఫ్రీ నెట్‌ఫ్లిక్స్

భారత్‌లో అందుబాటులో ఉన్న ఓటీటీ సర్వీసుల్లో అత్యంత ఖరీదైన సబ్‌స్క్రిప్షన్ నెట్‌ఫ్లిక్స్. మీరు సరైన ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకుంటే ఈ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా(విఐ) ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి రీఛార్జ్ చేస్తే ఉచిత ఓటీటీ యాక్సెస్‌ను అందిస్తున్నాయి. చౌకైన ఉచిత నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ల లిస్ట్ చూద్దాం..

జియో రీఛార్జ్

రిలయన్స్ జియో కస్టమర్లకు చౌకైన ఉచిత నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ రూ.1,299. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు కాగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్(మొబైల్) సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ కూడా 90 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

వొడాఫోన్ ఐడియా ప్లాన్

వొడాఫోన్ ఐడియా(వీఐ) ఉచిత నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ రూ.1,198. ఇది 70 రోజుల వాలిడిటీని అందిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తోపాటు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. దీనికి 70 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ (టీవీ+మొబైల్) సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. చాలా అదనపు ప్రయోజనాలను ఉంటాయి.

ఎయిర్‌టెల్ ప్లాన్

ఎయిర్ టెల్ వినియోగదారులకు రూ.1,798 విలువైన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపుకునే వెసులుబాటు కల్పించారు. రీఛార్జ్ చేసుకున్న వారికి నెట్‌ఫ్లిక్స్ బేసిక్ స‌బ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాక్సెస్ లభిస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.