తన బోర్డు ఆఫ్ డైరెక్టర్లు తమ వాటాదారులకు 2.50% డివిడెండ్ చెల్లించడానికి రికార్డు తేదీని ఈ జులై 11, 2025 (శుక్రవారం)గా నిర్ణయించినట్లు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తాజాగా ప్రకటించింది. ఈ వివరాలను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది.
"2025 ఏప్రిల్ 26న జరిగిన సమావేశంలో బోర్డు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ను పరిగణించి సిఫార్సు చేసింది. దీనికి సంబంధించి, డివిడెండ్ పొందడానికి అర్హులైన సభ్యులను నిర్ణయించడానికి రికార్డు తేదీ 2025 జులై 11, శుక్రవారం అని గమనించగలరు," అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ గురువారం బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది.
రికార్డు తేదీ అనేది ఒక కంపెనీ ఏ వాటాదారు డివిడెండ్ పొందడానికి అర్హుడు? అని నిర్ణయించడానికి ఉపయోగించే కట్-ఆఫ్ డేట్. రాబోయే డివిడెండ్ చెల్లింపుకు అర్హత పొందాలంటే, పెట్టుబడిదారుడు ఎక్స్-డివిడెండ్ తేదీకి ముందే స్టాక్ను కొనుగోలు చేయాలి.
ఏప్రిల్ 26న దాఖలు చేసిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో, ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 0.25 (ముఖ విలువ రూ. 10లో 2.5%) డివిడెండ్ను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.
"బ్యాంకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఈరోజు జరిగిన సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో ఈక్విటీ షేరు (ముఖ విలువ రూ. 10/-)కు రూ. 0.25/- (ముఖ విలువలో 2.50%) డివిడెండ్ను పరిశీలించి, సిఫార్సు చేశారని మీకు తెలియజేయాలనుకుంటున్నాము. ఇది బ్యాంకు రాబోయే వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుంది," అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అంతకుముందు బీఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది.
దీని అర్థం.. రికార్డు తేదీ వరకు అర్హులైన ప్రతి వాటాదారుడు వారు కలిగి ఉన్న బ్యాంకు షేర్ల సంఖ్యను బట్టి ఒక్కో షేరుకు రూ. 0.25 డివిడెండ్ చెల్లింపును అందుకుంటారు.
గురువారం స్టాక్ మార్కెట్ సెషన్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు 0.54% లాభంతో రూ. 77.64 వద్ద ముగిశాయి. గత ఐదేళ్లలో ఈ ప్రైవేట్ బ్యాంక్ షేర్లు స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు 189% పైగా రాబడిని అందించాయి. అయితే, గత ఒక సంవత్సర కాలంలో ఈ స్టాక్ 4.25% నష్టపోయింది.
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి (వైటీడీ) చూస్తే, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు 20.64% లాభపడ్డాయి. గత ఐదు సెషన్లలో 7.29% పెరిగాయి. ఈ షేర్లు 2024 జులై 4న రూ. 82.09 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని చేరుకోగా, 2025 ఏప్రిల్ 7న రూ. 52.50 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకాయి.
గురువారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 56,943.71 కోట్లుగా ఉంది.
సంబంధిత కథనం