మార్కెట్‌లో సంచలనం సృష్టించనున్న హ్యుందాయ్.. భారత్‌‌లో 26 కొత్త కార్లు లాంచ్‌కు ప్లాన్!-hyundai to launch 26 new models in india by 2030 bayon palisade ng creta ng i20 fl verna fl exter ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మార్కెట్‌లో సంచలనం సృష్టించనున్న హ్యుందాయ్.. భారత్‌‌లో 26 కొత్త కార్లు లాంచ్‌కు ప్లాన్!

మార్కెట్‌లో సంచలనం సృష్టించనున్న హ్యుందాయ్.. భారత్‌‌లో 26 కొత్త కార్లు లాంచ్‌కు ప్లాన్!

Anand Sai HT Telugu

హ్యుందాయ్ ఇండియన్ మార్కెట్లో సంచలనం సృష్టించబోతోంది. 26 కొత్త కార్లను భారత్‌లో విడుదల చేయనుంది. దాని వివరాలు తెలుసుకుందాం.

హ్యుందాయ్ లాంచ్ ప్లాన్ (Hyundai )

భారతదేశ ప్యాసింజర్ వాహన మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో హ్యుందాయ్ తన పట్టును బలోపేతం చేసుకోవడానికి రెడీ అవుతోంది. 2030 నాటికి కంపెనీ 26 కొత్త మోడళ్లను భారతదేశంలో విడుదల చేయనుంది. ఇందులో కొత్త కార్లు, ఫేస్ లిఫ్ట్ వెర్షన్లు, హైబ్రిడ్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి.

హ్యుందాయ్ చాలా కాలంగా భారతదేశంలో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. టాటా, మహీంద్రాలాంటి కంపెనీల వేగవంతమైన వృద్ధి సవాలుగా మారింది. అటువంటి పరిస్థితిలో హ్యుందాయ్ దేశీయ డిమాండ్‌ను తీర్చడమే కాకుండా, దక్షిణ కొరియా తరువాత అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా చేయాలనుకుంటోంది.

హ్యుందాయ్ బయాన్ (2026) హ్యుందాయ్ ఐ20 ఆధారిత క్రాసోవర్ మారుతి ఫ్రాంక్స్‌కు ప్రత్యర్థిగా ఉంటుంది. ధర రూ.10 లక్షల నుంచి ప్రారంభమై రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఇది 2026 మధ్య నాటికి లాంచ్ కానుంది.

న్యూ-జెన్ వెన్యూ (అక్టోబర్ 2025) కొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్లను పొందుతుంది. ప్రతి నెలా 10,000 యూనిట్లకు పైగా అమ్మకాల లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.

కొత్త ఐ20, అల్కాజార్ (2027-28) అద్భుతమైన స్టైలింగ్ పొందుతాయి. ఇది కాకుండా అనేక అద్భుతమైన ఫీచర్లు, భద్రతలో పెద్ద మార్పులు ఉంటాయి.

ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ 2026 మధ్య నాటికి తీసుకువస్తుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ టాటా పంచ్‌తో పోటీపడుతుంది. ఇది ప్రీమియం ఎక్స్టీరియర్, ఇంటీరియర్‌ను పొందుతుంది.

హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ఏప్రిల్ 2026 నాటికి విడుదల కానుంది. భారత్‌లో అంతగా రాణించకపోయినా ఎగుమతుల్లో వెర్నా టాపర్ గా నిలిచింది. ఇది కొత్త తరం వోక్స్ వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

న్యూ జనరేషన్ క్రెటా (2028) హ్యుందాయ్ మొత్తం అమ్మకాలలో 40 శాతం క్రెటా నుండి మాత్రమే వస్తుంది. కొత్త మోడల్ పెట్రోల్, డీజిల్, ఈవీ, హైబ్రిడ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 2028 ఫిబ్రవరి నాటికి లాంచ్ కానుంది.

హ్యుందాయ్ లాంచ్ ప్లాన్ భారతదేశాన్ని కేవలం మార్కెట్‌గా కాకుండా ప్రపంచ కార్యకలాపాల కేంద్రంగా మార్చాలని కంపెనీ కోరుకుంటోంది. రాబోయే 2-3 సంవత్సరాలలో మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే హ్యుందాయ్ ఈ లైనప్ మీకు అనేక ఆప్షన్స్ ఇస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.