భారత ప్రభుత్వం జారీ చేసే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) ఒక సాంప్రదాయికమైన పొదుపు పథకం. పెట్టుబడులు పరిచయం లేనివారికి లేదా కొత్తగా పొదుపు పథకాల్లో చేరే వారికి ఎన్ఎస్సి అనేది స్థిర-ఆదాయ పెట్టుబడి పథకం. ఇది హామీ రాబడితో సురక్షితమైన నమ్మదగిన ఎంపిక. పన్ను ప్రయోజనాలు, ఆకర్షణీయమైన రాబడి రేట్ల కారణంగా ఇది సాధారణ, మధ్య తరహా పెట్టుబడిదారులలో ప్రజాదరణ పొందింది.
ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రమానుగత వడ్డీ రేట్ల సర్దుబాటు చేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (జనవరి-మార్చి) ప్రస్తుత ఎన్ఎస్సీ వడ్డీ రేటు సంవత్సరానికి 7.7 శాతంగా ఉంది. ఈ రేటు అంతకుముందు త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్ 2023)తో పోలిస్తే స్థిరంగా ఉంది.
నేషనల్ సేవింగ్స్ స్కీమ్లో పెట్టుబడి ఒక సరళమైన ప్రక్రియ. ఇది రెండు ప్రాథమిక మార్గాలను అందిస్తుంది. ఒకటి ఆఫ్లైన్ (ఫిజికల్ సర్టిఫికేట్), రెండోది ఆన్లైన్ (ఇ-మోడ్).
తమ పెట్టుబడుల కోసం ఇంటర్నెట్ ఉపయోగించడానికి ఇష్టపడని వ్యక్తులు ఎన్ఎస్సీని కొనుగోలు చేయడానికి ఆఫ్లైన్ పద్ధతి ఎంచుకోవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లో పెట్టుబడి పెట్టడానికి ఆన్లైన్ మోడ్ ఒక ప్రత్యామ్నాయం. ఇంటర్నెట్ ద్వారా ఈ సాధనాలలో సౌకర్యవంతంగా పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఎన్ఎస్సిల యొక్క ముఖ్యమైన లక్షణాలు:
టాపిక్