ఆదాయపు పన్ను దాఖలుకు గడువు సమీపిస్తోంది. ఆదాయపు పన్నుకు సంబంధించి వందలాది నిబంధనలు ఉన్నాయి. మరణించిన వ్యక్తికి సంబంధించి ఐటీఆర్ సమర్పించాలనే విషయం చాలా మందికి తెలియదు. ఐటీఆర్ ఫైల్ చేసే విషయానికి వస్తే చనిపోయిన వ్యక్తి ఎంత సంపాదించాడనేది కూడా లెక్కిస్తారు.
మృతి చెందిన వ్యక్తి ITR ఫైలింగ్ కోసం ఆర్థిక సంవత్సరం ప్రారంభ తేదీ నుండి మరణించిన తేదీ వరకు ఆదాయాలను పరిగణించాలి. ఉదాహరణకు.. Mr. X నవంబర్ 30 2023న మరణిస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అతని ఐటీఆర్ ఏప్రిల్ 1 నుండి నవంబర్ 30 వరకు ఆదాయానికి సంబంధించి ఫైల్ చేయాలి.
మరణించిన వ్యక్తి వీలునామా చేసి ఉంటే అతని వారసులు ఐటీఆర్ ఫైల్ చేయాలి. వీలునామా చేయకపోతే మరణించిన వ్యక్తి బంధువులు అంటే భర్త, భార్య, పిల్లలు చట్టబద్ధమైన వారసులుగా పరిగణిస్తారు. వారు ITR దాఖలు చేయాలి. ఇది కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
మరణించిన వ్యక్తి ఐటీఆర్ ఫైల్ చేసే వ్యక్తి మరణించిన వ్యక్తి వారసుడిగా ఈ-ఫైలింగ్ పోర్టల్లో నమోదు చేసి ఉండాలి. మరణించిన వారి వారసులు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ని ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్కు లాగిన్ చేసి, 'అధీకృత భాగస్వాములు' ట్యాబ్లో రిప్రజెంటేటివ్లుగా నమోదు చేయడాన్ని ఎంచుకోవాలి. దీని కోసం మరణించిన వారి పాన్, మరణ ధృవీకరణ పత్రం కావాలి. వారసుల పాన్, బ్యాంకు ఖాతా, వారసులమని రుజువు, నష్టపరిహారం లేఖ కూడా అవసరం. వీటిని పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఐటీ శాఖ నుండి అనుమతి పొందిన తర్వాత మృతి చెందిన వారి చట్టపరమైన వారసులు మరణించిన వారి తరపున ఐటీఆర్ దాఖలు చేయవచ్చు.
బతికి ఉన్న వ్యక్తి ఐటీఆర్ దాఖలు చేసిన విధంగానే మరణించిన వారి ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తేడా ఏంటంటే, ప్రతినిధి అసెస్సీ ఒకరిని ఎంచుకోవాలి. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తేదీ నుండి మరణించిన తేదీ వరకు అతని సంపాదన ఆదాయంగా పరిగణిస్తారు. ఈ ఆదాయం ఎఫ్డీ నుండి, షేర్ల నుండి లేదా ఇతర ఆస్తుల నుండి కావచ్చు.
మరణించినవారి ఆస్తుల నుండి ఆర్జించిన ఆదాయాన్ని ప్రకటించకపోతే, వారసుడు లేదా ప్రతినిధి దానికి బాధ్యత వహించాలి. చట్టపరమైన వారసత్వం లేదా చట్టపరమైన వారసుడు సర్టిఫికేట్ పొందడంలో జాప్యానికి కారణం ఇస్తే.. ఆదాయపు పన్ను శాఖ అడగదు. వారసులు మరణించినవారి ఆదాయాన్ని ఐటీఆర్లో నమోదు చేయాలి. ఆదాయాన్ని దాచుకునే పని చేస్తే.. నోటీసులొచ్చినా వస్తాయి. అందుకే మరణించిన వారికి కూడా ఐటీఆర్ ఫైల్ చేస్తే మంచిది.
టాపిక్