ఐఫోన్, ఆండ్రాయిడ్ మొబైల్‌పై ఛార్జీల్లో తేడా ఎందుకు? ఓలా, ఉబర్ సంస్థలకు కేంద్రం నోటీసులు-govt issues notice to ola uber on differential pricing on iphone android ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఐఫోన్, ఆండ్రాయిడ్ మొబైల్‌పై ఛార్జీల్లో తేడా ఎందుకు? ఓలా, ఉబర్ సంస్థలకు కేంద్రం నోటీసులు

ఐఫోన్, ఆండ్రాయిడ్ మొబైల్‌పై ఛార్జీల్లో తేడా ఎందుకు? ఓలా, ఉబర్ సంస్థలకు కేంద్రం నోటీసులు

HT Telugu Desk HT Telugu
Jan 23, 2025 03:32 PM IST

Differential pricing: ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజ్ లపై ఛార్జీల్లో తేడా ఎందుకు ఉందని ఓలా, ఉబెర్ లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

వినియోగదారులు ఉపయోగించే మొబైల్ పరికరం రకాన్ని బట్టి వేర్వేరు ధరలను నిర్ణయించడంపై ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబెర్ లకు వినియోగదారుల వ్యవహారాల శాఖ నోటీసులు జారీచేసింది.
వినియోగదారులు ఉపయోగించే మొబైల్ పరికరం రకాన్ని బట్టి వేర్వేరు ధరలను నిర్ణయించడంపై ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబెర్ లకు వినియోగదారుల వ్యవహారాల శాఖ నోటీసులు జారీచేసింది.

వినియోగదారులు ఉపయోగించే మొబైల్ పరికరం రకాన్ని బట్టి వేర్వేరుగా ఛార్జీలు చూపుతున్నాయన్న ఆందోళనల మధ్య ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబెర్‌లకు వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలు తీసుకుంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, కొత్త పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్‌పై ఒక పోస్ట్ ద్వారా ఈ చర్యను ప్రకటించారు.

వివిధ మోడళ్ల మొబైల్స్ ‌పై క్యాబ్ ఛార్జీలు వేర్వేరుగా ఉండడాన్ని గమనించి వినియోగదారుల వ్యవహారాల శాఖ సీసీపీఏ ద్వారా ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబెర్‌లకు నోటీసులు జారీ చేసిందని తెలిపారు.

పరికరం రకాన్ని బట్టి వినియోగదారులకు నష్టం కలిగించే ధరల వ్యూహాలలో నిమగ్నమయ్యాయా అనే దానిపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) ప్రశ్నలు లేవనెత్తింది. వినియోగదారులు ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఒకే విధమైన మార్గాలు, సమయాలకు ఛార్జీలు మారవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ నోటీసుపై క్యాబ్ అగ్రిగేటర్లు ఇంకా స్పందించలేదు. ఆండ్రాయిడ్ యూజర్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్ యూజర్లకు ఉబెర్ అధిక ఛార్జీలు వసూలు చేస్తుందని గతంలో ఓ సోషల్ మీడియా యూజర్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఒకే ఉబెర్ ఆటో రైడ్ కోసం వేర్వేరు రేట్లతో రెండు వేర్వేరు మొబైల్ ఫోన్లను ప్రదర్శిస్తూ ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ఫోటో ఈ వాదనకు మద్దతు ఇచ్చింది. ఈ చిత్రంలో ఆండ్రాయిడ్ డివైస్ పై ఛార్జీలు రూ. 290.79 కాగా, ఆపిల్ ఐఫోన్ లో రూ. 342.47 అధిక ఛార్జీని చూపిస్తుంది.

సుధీర్ అనే సోషల్ మీడియా యూజర్ ఉపయోగించిన పరికరం ఆధారంగా ఉబెర్ లో ఛార్జీల వ్యత్యాసాలను గమనించి తన అనుభవాన్ని పంచుకున్నాడు. "ఒకే పికప్ పాయింట్, గమ్యం, సమయం. కానీ రెండు వేర్వేరు ఫోన్లు రెండు వేర్వేరు రేట్లను చూపాయి. నా కుమార్తె ఫోన్‌తో పోలిస్తే నాకు ఎక్కువ ఛార్జీ పడుతోంది. కాబట్టి నా రైడ్లను బుక్ చేయమని నేను తరచుగా ఆమెను అడుగుతాను. మీకు కూడా ఇలా జరుగుతుందా? దాన్ని నివారించడానికి ట్రిక్ ఏంటి?' అని రాసుకొచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం