UPI Merchant Charges : యూపీఐ, రూపే కార్డు లావాదేవీలపై మర్చంట్ ఛార్జీలు విధించే అవకాశం!-government may restore merchant charges on upi rupay transactions for big firms check out details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Upi Merchant Charges : యూపీఐ, రూపే కార్డు లావాదేవీలపై మర్చంట్ ఛార్జీలు విధించే అవకాశం!

UPI Merchant Charges : యూపీఐ, రూపే కార్డు లావాదేవీలపై మర్చంట్ ఛార్జీలు విధించే అవకాశం!

Anand Sai HT Telugu

UPI Merchant Charges : యూపీఐ అనేది ఇటీవలి కాలంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే చెల్లింపు సాధనంగా మారింది. అయితే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పెద్ద వ్యాపారుల నుండి ఛార్జీలు వసూలు చేయవచ్చు. ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

యూపీఐ, రూపేపై మర్చంట్ ఛార్జీలు

యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో జరిపే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్)ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం లావాదేవీలు ఉచితమే అయినా పెద్ద వ్యాపారాలకు ఛార్జీలు వసూలు చేయాలని బ్యాంకులు కోరుతున్నాయి. దాని ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. అయితే యూపీఐ మునుపటి మాదిరిగానే చిన్న వ్యాపారులకు ఉచితం. దీని వల్ల సామాన్యులు కూడా ఇబ్బంది పడరు.

యూపీఐ, రూపేపై ఛార్జీలు

ఏటా రూ.40 లక్షలకు మించి విక్రయించే వ్యాపారుల నుంచి మర్చంట్ ఫీజు వసూలు చేయాలని బ్యాంకింగ్ పరిశ్రమ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో కోరినట్లు తెలిసింది. పెద్ద వ్యాపారులు ఇప్పటికే వీసా, మాస్టర్ కార్డ్, క్రెడిట్ కార్డులపై మర్చంట్ ఫీజు చెల్లిస్తున్నప్పుడు యూపీఐ, రూపే కార్డులపై కూడా ఛార్జీలు వసూలు చేయాలని బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు వాదిస్తున్నాయి.

పెద్ద వ్యాపారుల నుంచి

2022 బడ్జెట్లో ప్రభుత్వం ఎండీఆర్‌ను రద్దు చేసిన సమయంలో ఈ చర్య ఉద్దేశం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే అని చెప్పింది. కానీ ఇప్పుడు యూపీఐ ఎక్కువగా ఉపయోగించే చెల్లింపు సాధనంగా మారింది. ప్రభుత్వం ఈ సదుపాయం ఖర్చును భరించడానికి బదులుగా పెద్ద వ్యాపారుల నుండి వసూలు చేయవచ్చు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మర్చంట్ ఛార్జీలు

ఈ ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వం టైర్ వ్యవస్థను అమలు చేయవచ్చు. అంటే బడా వ్యాపారుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారు. చిన్న వ్యాపారులు తక్కువ రుసుము చెల్లించవచ్చు. ఎండీఆర్ అనేది డిజిటల్ చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయడానికి మర్చంట్ డిస్కౌంట్ రేటు వారి బ్యాంకుకు చెల్లించే ఛార్జీ. వినియోగదారుడు యూపీఐ లేదా డెబిట్ కార్డుతో చెల్లింపులు చేస్తే బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు ఐటీ వ్యవస్థకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. దీనిని భర్తీ చేయడానికి మర్చంట్ ఫీజులను ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఫీజును రద్దు చేసింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం