Gold rate today : భారీగా పెరిగిన వెండి ధర.. పసిడి కూడా! నేటి రేట్లు ఇవే..
Gold rate today : దేశంలో వెండి ధరలు భారీగా పెరిగాయి. పసిడి, ప్లాటీనం రేట్లు కూడా వృద్ధి చెందాయి. ఆ వివరాలు..
Gold rate today : దేశంలో బంగారం ధరలు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 200 పెరిగి.. రూ. 54,900కి చేరింది. శనివారం ఈ ధర రూ. 54,700గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 2,000 పెరిగి, రూ. 5,49,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,490గా కొనసాగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 220 వృద్ధి చెంది.. రూ. 59,890కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 59,670గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 2,200 పెరిగి.. రూ. 5,98,900గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,050గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,040గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,900 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 59,890గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,300గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,320గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 54,900గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 59,890గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,900గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,890గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,950గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 59,940గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 54,900గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,890గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,470గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 700 పెరిగి రూ. 74,700కి చేరింది. శనివారం ఈ ధర రూ. 74,000గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 78,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 74,700.. బెంగళూరులో రూ. 73,500గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ.350 పెరిగి.. రూ 24,760కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 24,410గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,760గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం