Gold price : 2025లో 23శాతం పెరిగిన బంగారం ధరలు- నెక్ట్స్​ ఏంటి? ఇంకా పెరుగుతాయా? లేక పడుతాయా?-gold prices surge 23 percent in 2025 will the rally continue ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price : 2025లో 23శాతం పెరిగిన బంగారం ధరలు- నెక్ట్స్​ ఏంటి? ఇంకా పెరుగుతాయా? లేక పడుతాయా?

Gold price : 2025లో 23శాతం పెరిగిన బంగారం ధరలు- నెక్ట్స్​ ఏంటి? ఇంకా పెరుగుతాయా? లేక పడుతాయా?

Sharath Chitturi HT Telugu

Gold price rally : ఈ ఏడాది బంగారం ధరలు 23 శాతం పెరిగాయి. వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు, డాలర్ క్షీణత, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు ఇందుకు కారణం. మరి బంగారం ధరలు ఇంకా పెరుగుతాాయా? లేక ఇప్పుడు పడతాయా? నిపుణులు మాట ఇది..

బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? (Pixabay)

బంగారం ధరలు ఈ ఏడాది ఇప్పటికేే విపరీతంగా పెరిగాయి. దేశీయ స్పాట్ గోల్డ్ ధరలు ఈ ఏడాది ఇప్పటివరకు 23 శాతం వృద్ధిచెందాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే పసిడి ధర 5 శాతం పెరిగింది. ఎంసీఎక్స్ గోల్డ్ జూన్ 5 కాంట్రాక్టు గత శుక్రవారం (ఏప్రిల్ 11) 10 గ్రాములకు రూ .93,940 వద్ద ఆల్- టైమ్ గరిష్టాన్ని తాకింది. చివరకు 10 గ్రాములకు 0.15 శాతం పెరిగి రూ.93,887 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ పసిడి ధరలు కూడా బలమైన లాభాలను చూశాయి. కామెక్స్ గోల్డ్ 2.44 శాతం పెరిగి 3,254.90 డాలర్ల వద్ద ముగిసింది. మరి నెక్ట్స్​ ఏంటి? గోల్డ్​ ప్రైజ్​ పడుతుందా? లేక పెరుగుతుందాయ నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

బంగారం ధరలు ఈ ఏడాది ఇంతలా పెరగడానికి బలమైన కారణాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. వాటిల్లో అతిపెద్దది వాణిజ్య యుద్ధంపై ఆందోళనలు! ట్రేడ్ వార్ భయాలు బంగారం ధరలకు ఊతమిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న టారీఫ్​ ప్రకటనలతో అనిశ్చితి పెరిగిపోయింది. చైనాపై సుంకాలను 145 శాతానికి పెంచారు. చైనా కూడా ప్రతీకారం తీర్చుకుని అమెరికా వస్తువులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచింది.

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వృద్ధి చుట్టూ అనిశ్చితిని పెంచాయి. ఫలితంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. సాంప్రదాయక సురక్షిత అసెట్​గా పేరు తెచ్చుకోవడంతో బంగారం ధరలు ఈ పరిస్థితుల్లో పెరుగుతున్నాయి.

ట్రంప్ టారిఫ్ చర్యలు ఈ ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోతుందనే ఆందోళనలను రేకెత్తించాయి. సంభావ్య మందగమనం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడానికి ప్రేరేపించవచ్చు. ఇది సాధారణంగా బంగారం ధరలకు మద్దతు ఇస్తుంది.

డాలర్ ఇండెక్స్ క్షీణించడం కూడా బంగారం ధరలు పెరగడానికి మరో కీలక అంశం. యూఎస్ డాలర్ ఇండెక్స్ శుక్రవారం 100 దిగువకు పడిపోయి 99.78 వద్ద ముగిసింది.

అంతర్జాతీయంగా బంగారం ధరను డాలరులో చూస్తుండటంతో, ఆ దేశ కరెన్సీ బలహీనపడతున్నప్పుడు ఇతర కరెన్సీలలో బులియన్ చౌకగా మారుతుంది. డిమాండ్ పెరుగుతుంది.

బంగారం ధరల్లో ర్యాలీ కొనసాగుతుందా?

వాణిజ్య యుద్ధం, డాలర్ క్షీణత, రేట్ల కోత అంచనాల కారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

"వాణిజ్య యుద్ధ సంబంధిత అనిశ్చితులు, పెరుగుతున్న మాంద్యం భయాలతో బంగారం ధరల ర్యాలీ కొనసాగవచ్చు. బలహీనమైన యూఎస్ డాలర్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతకు అవకాశం ఉండటంతో పసిడి పరుగుకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది. 2025 చివరి నాటికి అంతర్జాతీయ బంగారం ధర ట్రాయ్ ఔన్స్​కి 3,300-3,500 డాలర్లకు, దేశీయ బంగారం 10 గ్రాములకు రూ .97,000 కు చేరుకుంటుందని మేము ఆశిస్తున్నాము," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ అండ్ కరెన్సీ ప్రాడక్ట్స్​ హెడ్ అనూజ్ గుప్తా అన్నారు.

ఎల్​కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది మాట్లాడుతూ.. “కొనుగోలుదారులకు అనుకూలంగా ఉన్న పరిస్థితులతో, బంగారం ఇప్పుడు రూ .94,500–రూ .95,000 వద్ద రెసిస్టెన్స్ జోన్​ని టార్గెట్​ చేసింది. రూ .92,000 ముఖ్యమైన సపోర్ట్​ ఉంది,” అని పేర్కొన్నారు.

(గమనిక- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే.)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం